పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది


రచయిత

జననం 1889. కాశ్మీర బ్రాహ్మణులు. తండ్రి మోతీలాల్ నెహ్రూ. ......... న్యాయవాది. తల్లి స్వరూపరాణి. జన్మస్థానం ప్రయాగ. అలహాబాద్ ఇంటివద్ద కొంతకాలం ప్రైవేటు చదువుకొని హారోరో, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోని ట్రినిటీ కళాశాలలో విద్య నభ్యసించారు. అలహాబాద్ హైకోర్టులో న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించారు. 1918 ఇండియన్ హోమ్‌రూల్ లీగుకు కార్యదర్శి అయినారు. 1918 నుంచి అఖిలభారత కాంగ్రెస్ సభలో సభ్యుడుగా నున్నారు. 1921 లో మొదటిసారి కారాగృహవాసా న్ననుభవించారు. ఇప్పటికి ఎనిమిదిమారులు శ్రీకృష్ణజన్మస్థానాన్ని చూచివచ్చారు. 1929 లో కాంగ్రెస్ కార్యదర్శి అయినారు. 1930 లోను 1936, 37, 46 లలోనూ కాంగ్రెస్ అధ్యక్షులయినారు. వివాహితులు. భార్య కమలా నెహ్రూ చనిపోయింది. కొడుకులు లేరు. ఒక్కతే కుమార్తె-ఇందిరా గాంధీ. చెల్లెండ్రిద్దరు-విజయలక్ష్మీ పండిట్, శ్రీకృష్ణ హరిసింగ్

ఈయన గొప్ప ప్రజాస్వామ్యవాది. ఆంగ్లంలో అనేక గ్రంథాలను రచించినారు. వీరి రచనలో 'సోవియట్ రష్యా