పుట:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చంద్రగుప్తమౌర్యుడు : అర్థశాస్త్రము

109


రేలుట కేర్పాట్లుచేసెను. అలెగ్జాండ్రియా ముఖ్యపట్టణముగా నతడుపరిపాలించినఈజిప్టు ప్రబలరాజ్యమైనది. విజ్ఞానశాస్త్రమునకును, తత్వశాస్త్రమునకును, పాండిత్యమునకును ఆ మహానగరము ప్రసిద్ధికెక్కెను.

పర్షియా, మెసపొటేమియా, ఆసియామైనరులో భాగము వేరొక సేనానివశ మైనవి. అతనిపేరు సెల్యూకసు. అలెగ్జాండరు జయించిన ఇండియా వాయవ్యప్రాంతముకూడ అతని వశమయ్యెను. కాని ఇండియాలో ఏభాగమును అతడు నిలుపుకోలేకపోయెను. అలెగ్జాండరు మరణానంతరము గ్రీకుసైన్యము ఆప్రాంతమునుండి తరుమగొట్టబడెను.

అలెగ్జాండరు ఇండియాకు క్రీ. పూ. 326 సంవత్సరములో వచ్చెను. అతని రాక ఒకచిన్న దాడిమాత్రమే. దానివల్ల ఇండియా కెట్టిలాభముగాని, నష్టముగాని కలుగలేదు. ఇండియా దేశస్థులకును, గ్రీకులకును ఈ దాడివల్ల సంబంధమేర్పడినదని కొందరందురు. కాని, నిజమునకు అలెగ్జాండరుకాలమునకు పూర్వముసైతము ప్రాక్‌పశ్చిమములకు రహదారి యుండెను. పర్షియాతోను, గ్రీకుతో సైతము ఇండియా నిరంతర సంబంధము కలిగియేయుండును. అలెగ్జాండరురాకవలన ఆ సంబంధము మరింత వృద్ధియైయుండును. ఇండియా, గ్రీసువిజ్ఞానము అధికముగా సంమ్మిశ్రితములై యుండును.

అలెగ్జాండరుదాడియు, అతని మృతియు ఇండియాలో ఒక గొప్పసామ్రాజ్యమును-మౌర్యసామ్రాజ్యమును స్థాపించుటకుదారితీసెను. హిందూదేశ చరిత్రలో ఇదియొక గొప్పయుగము. కాన దానిని గురించి తెలిసికొనుటకు కొంతకాలము వినియోగింతము.

18

చంద్రగుప్తమౌర్యుడు : అర్థశాస్త్రము

జనవరి 25, 1931

నేనొక ఉత్తరములో మగధపేరెత్తితిని. ఇది యొక ప్రాచీనరాజ్యము. ఇప్పుడు బీహారున్నచోట అది యుండెడిది. ఈరాజ్యమునకు