iii "సీ. బింబోష్టియని నీవు, పెనఁగ రాకు శుకంబ!
సాంకవగంధి యీ పంకజాక్షి”
యను రసికజనమనోభిరామమునందలి పద్యము చాలవఱ కిందలి 8వ పద్యమునుబోలును.
iv రంభాద్యప్సరస కాంతలనామములు తారాశశాంకాది ప్రబంధముల శ్లేషింపఁబడుటకుఁ బూర్వమే యిందలి 46 46వ పద్యమున నట్లుపయోగింపఁ బడినవి.
v మనుచరిత్రలోని "మీటినయంత నిచ్చు చనుమట్ట" లను మాటయు విజయవిలాసములోని "మీటిన విచ్చు చనుదోయి" యనుమాటయు గ్రొత్తది కావని యిందలి 6వ పద్యము తెలుపును.
vi. ఆలాగున నే "జగతి నెంతటి యుపకారి శంబరారి" యన్న విజయవిలాస పద్యభాగము దీనిలోని 11వ పద్యమున నున్న "యుపకారియగుంగద శంబరారి!" యను దానిని జూచి వ్రాయఁబడినదా యనిపించును.
నాకు లభించిన ప్రతి మిగులఁ బ్రాఁతదైనందునఁ గొన్ని యెడలఁ జినింగిపోయినది. అట్టిచోటులఁ బోయినమాటలను నేనే పూరించితిని. అట్లు కలుపఁబడిన భాగము లేవో శ్రీనాథవిరచిత భాగము లేవో శైలులవలన దెలియుట సులభముగాన వానిని వేఱువేఱుగా జూపలేదు.
దీని ప్రతి మఱియెవ్వరియొద్దనైన నున్నచో నాకు బంపినయెడల రెండవకూర్పునందైన నిందలి లోపముల సవరింతును.
విశాఖపట్టణము
సెట్టి లక్ష్మీనరసింహము బి. ఎ.
1. ఆగష్టు 1905
రుక్మిణీకల్యాణ నాటకగ్రంథకర్త.
మున్సెస్సేవియన్ కాలేజిలో నుపాధ్యాయుడు.