పుట:పాండురంగమహాత్మ్యము.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

23


స్తోమాపాకరణపటు
శ్యామల తరవాలజయసహాయభుజునకున్.

92


క.

రవికిరణరుచికి మతిభా
రరికి విమతసచివగళితరవపదభూషా
రవికి భుజాంతరమణిహా
రవికిని రుచిరాకృతికి ధరాశ్రుతికృతికిన్.

93


క.

రామానుజార్యసుతునకు
శ్రీమంతున కర్థిసార్థజీమూతహయ
స్తోమోన్నతికి విరూరి
శ్రీమద్వేదాద్రి మంత్రిసింహంబునకున్.

94

కథాప్రారంభము

వ.

అభ్యుదయపరంపరాభివృద్ధిగా నాయొనర్పఁబూనిన పౌండరీక
మాహాత్మ్యంబునకుం గథావిధానం బెట్టిదనిన.

95


మ.

తులితోక్షధ్వజసూతుఁడై వెలయుసూతుం గాంచి మున్ శౌనకా
దులు క్షేత్రంబును వేల్పుఁదీర్థము బుధస్తుత్యప్రభావంబులై
దళితైనస్తిమిరంబులై యిహపరార్థప్రాప్తిమూలంబులై
యిలపై నొక్కడఁ గల్గెనే ననఘమూర్తీ తెల్పవే నావుడున్.

96


క.

ఆఋషులప్రశ్న మంగీ
కారం బొనరించి పలుకు గథకుఁడు శ్రీనా
థారాధసహితచర్యున్
బారాశర్యుం దలంచి ప్రాంజలియగుచున్.

97