పుట:పాండురంగమహాత్మ్యము.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

పాండురంగమహాత్మ్యము


హారియశుఁ డైనకలకాళహస్తితనయ
తిరుమలాంబయు నిత్యవర్ధిష్ణులక్ష్మి.

76


సీ.

వేదమార్గప్రతిష్టాదైవతజ్యేష్టుఁ
        డభ్యస్తషడ్దర్శనార్థరాశి
యతిరాజరచితభాష్యగ్రంథనిర్ణేత
        యఖిలపురాణేతిహాసకర్త
బంధురదివ్యప్రబంధానుసంధాత
        పంచసంస్కారప్రపంచచణుఁడు
వాధూలమునిచంద్రవంశవర్ధనమూర్తి
        సకలదేశాచార్యనికరగురువు


గీ.

పట్టమేనుంగు శ్రీరంగపతికి నణ్ణ
గారిగర్భాంబురాశినీహారరశ్మి
సారసాహిత్యసర్వస్వసయ్య నేటి
యాళవందారుకంగాళయప్పగారు.

77


శా.

తత్తాదృగ్విభవప్రభావనిధిఁ గందాళప్పగారి న్దయా
యత్తస్వాంతు నితాంతశాంతియుతు లోకాచార్యవర్యు న్సుధీ
చిత్తాంభోరుహభానుఁ గొల్చుచుఁ దదాశీర్వాదలబ్ధోన్నతిన్
హత్తెన్ దాను కరూరిమంత్రిమణి వేదాద్రీశుఁ డుద్యద్రుచిన్.

78


వ.

వెండియు నవ్వేదాద్రి మంత్రీశ్వరుండు రవికులతిలకుఁడును
రణరంగధీరుండును నంబునిధిగంభీరుండును భట్టరభావాంకుండును నక
లంకుండును నవత్తారుమండలీకరగండుండును నుద్దండభుజాదండుండు
నునై పరనారీసహోదరుం డయ్యును నితరసముపార్జితవధూవల్లభుండు
ను గోపికాగోవిందుండయ్యు నీశ్వరలక్షణలక్షితుండును బొన్నాంచా
రుదేవి దివ్యశ్రీపాదపద్మారాధకుండయ్యును బ్రతిష్టాపితపరమవైష్ణవకు
టుంబవిశేషుండును నయిన ఘనుని.

79


గీ.

గుఱుతుగలరాజు మంగయ గురువరాజు
పుత్రు పెదసంగభూపాలు శత్రుజైత్రు