పుట:పాండురంగమహాత్మ్యము.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

13


గోనప్పయు ననఁదగువి
ద్యానిధు లిరువురును బుత్రులై మని రవనన్.

44


క.

నయవినయంబుల కైవడి
జయతేజము లట్లు విభవశమముల క్రియ స
వ్యయయశులు వెంగళయ కో
నయ లిరువురు వెలసి రవని నాథార్చితులై.

45


క.

ఆవెంగళమంత్రీశ్వరు
దేనికి శ్రీయౌభళాఖ్యతిలకపతికి రా
ధావిభుదేవేరియు నల
కావేరియు నీడుజోడు గౌరవకళలన్.

46


క.

గానకళాతుంబురుఁ డనఁ
గా నయవిద్యావివేకగౌరవలక్ష్మీ
జాని యనంగా నిద్ధర
గోపప్రభుఁ డొప్పు మంత్రికులతిలకంబై.

47


తే.

ఆ విదేహాధిపతిపుత్రి యాత్మభాగ్య
గాఁగ విఖ్యాతిఁ బొందు రాఘవునికరణి
రాఘవాంబాధినాథుఁడై శ్లాఘమీరు
శ్రీనృసింహుని కోనప్ప సిరులకుప్ప.

48


ఉ.

సామదరక్షణుఁ గొలిచి సన్నుతి కెక్కినభాగ్యశాలి శ్రీ
రామచమూపశేఖరుని రంగనమంత్రి ననంతమాంబికా
స్వామి నుతింతు మన్మథభుజానతపుష్పధనుర్మధూళిధా
రామధురోక్తిగుంభసభరస్ఫురణాపరిణాహచాతురిన్.

49


చ.

ఉరుమతి రంగమంత్రి తనయుల్ విలసిల్లిరి పుల్లమల్లికా
హరదరహాసహీరహిమహారపటీరయశోధురంధరుల్
వరదయగల్గువారు గుణవంతులు శాంతులు కాంతిచంద్రముల్
వరదయమంత్రిపుంగవుఁడు వాసవతుల్యుఁడు రాఘవయ్యయున్.

50