పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

తగునే భోగశిరోమణి, నగునే నొకవేళ నలఁగి యరుదెంచినఁ బై
నెగురుకొనఁ గొండ యెక్కడ, దగ రెక్కడ వలదె తారతమ్యం బరయన్.

372


క.

నలఁకువ ధర నెవ్వరికిం, గలయదియ మహాబలారిగా యితఁడంచుం
దలఁపక గౌరవమింతయు, సలుపక నను నసదుసేయజనునే నీకున్.

373


క.

అతిమణిఘృణిసంభరణో, చిత మగునాఫణము కష్టశీలా నీకు
త్సితపుటడుగులకు నర్హమె, తతినిక్కనలాఱ మ్రింగెద న్ని న్ననుచున్.

374


క.

వడి నొడిసిపట్టుకొని దెస, పడ నొడలుం దొడలు బడలుపడ నొక్కి ముదం
బడక దిగమ్రింగి వలసిన, కడ కరిగె న్మందవిదుఁడు కాకాధ్యక్షా.

375


వ.

ఏ నమ్మందవిదుచందంబున నవమానంబున కోర్చి ప్రతిపక్షషయం బాపాదించితి
నని చెప్పి చిరజీవి మఱియు మేఘవర్ణున కిట్లనియె.

376


క.

మూలముల జెఱుప ననల, జ్వాలలు తరువులన కాని చందనశైత్య
శ్రీల మగుగాడ్పుచెఱుచు, న్మూలంబులతోన వృక్షముల శీఘ్రమునన్.

377


క.

మనమున ఋణశేషము సా, ధనముల రిపుశేష మౌషధంబునఁ దనుసం
జనితగదశేష ముదకం, బున శిఖిశేషం బశేషముగఁ జేయఁదగున్.

378


చ.

ముడివడియున్నదుర్వ్యసనము న్సడలించి దురంతరోషపుం
గడలి సుశాంతిసేతువునఁ గట్టి సమాసమదేశకాలముల్
కడఁగని చిత్రగుప్తి పొసఁగ న్మనుఱేనికి వేయు నేల యి
ప్పుడమిఁ గరస్థలామలకము ల్గద సంపదలు న్శుభంబులున్.

379


క.

శరములఁ బడరు మనీషా, శరములఁ బడినట్లు రిపులు సమరము వలయున్
శరములకు వలదు ప్రజ్ఞా, శరములకుం గ్రాహ్య మెద్ది సరి యీరెంటన్.

380


క.

అలఁతులకు దైవయత్నము, బలవంతంబైన నెల్లపను లొదగు మహా
బలుల కది లేకయుండినఁ, బలుకులు వేయేల కడమ వడు సర్వంబున్.

381


వ.

సుచరితఫలంబులం గాక సకలకార్యంబులు చేకూడవు త్యాగంబున శూరుండును
వైదుష్యంబునం బ్రియుండును గుణంబుల లుబ్ధుండును నగుచు రాజు రాజ్యంబు
గావింపవలయు నిం దొక్కటి తక్కినం బురుషాకారంబు నిరర్థకం బని విందు మది
యట్టిద.

382


సీ.

ఘనరూపనిధి యనంగునకా యనంగత్వ ముచితమే బలి కహివ్యూహవసతి
పాండునందనునకా బహుకాలవనవాస మిభపురాధిపునకా యేటిచొరవ
యదుకులాధ్యక్షునకా శాపమరణంబు జాహ్నవీసుతునకా శస్త్రశయ్య
నలరాజుకా మహానసపాకభజనంబు నహుషునకా ఘోరనాగమూర్తి