పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కందువ చేరి భోగఫలకంబున నీపదము ల్వహించి యం
దుం దుదిముట్టనందనుకఁ ద్రోవక డగ్గఱఁ జేర్చుకొ మ్మిటన్.

359


క.

నను విశ్వసింపు మెప్పటి, కనుమానము మాను చచ్చునంతకు నెందుం
జననని దేవరనగరికి, దనపేరం గమ్మకట్టెదం గొనుమనుచున్.

360


ఆ.

కడుపుఁ జూపి చావగా నింక నెన్నఁడు, నడుపుకొనియె దనుచు చెడుగుఁబురుగు
చెప్పరానిప్రియముఁ జెప్పిన హృదయంబు, గరఁగి భేకరాజు తెరువు చూపి.

361


క.

ఆరోహింపఁగవలె గృ, ష్ణోరగ యీసరియవెంట నొద్దికిఁ జనుదె
మ్మా రయమున ననుటయు ని, ర్వారణనది సొచ్చి కదియ వచ్చెం గప్పన్.

362


క.

అప్పు డనురాగ మొప్పం, గుప్పలు గొని, క్రోతి గొమ్మ గొన్నట్లు వడం
గుప్పించి కప్పఱేఁ డ, ప్పప్ప పణిప్రవరు భోగ మారోహించెన్.

363


క.

జలపాదుని బాదుకొనం, దలనిడికొని త్రాచు నేచునటనం దటభూ
ముల కొంతసేపు ద్రిమ్మరి, యలసినగతి నూరకుండె నట్లుండుటయున్.

364


ఉ.

పన్నగభర్త జూచి జలపాదుఁడు పల్కె నిదేమి వేగసం
పన్నము గాకయున్నయది మందవిదా భవదీయవిగ్రహం
బన్న భుజంగ మిట్లను దయామయ యాఁకట దీలుపడ్డ నా
కున్నదె యానశక్తి కడు పోమినమీఁదటఁ జూడు చిత్రముల్.

365


క.

దొరలు తమవేడుకల జూ, తురు గాని వహించి తిరుగు తురగంబులఁ బ్రో
వరు మేపునీళ్ళతఱి నిడి, యరు దివ్విధ మనిన దర్దురాగ్రణి మదిలోన్.

366


క.

కలతెర గిట్టిద యనుచుఁ, దలఁచి యయో విప్రశాపదశ దనయిచ్చన్
వలసిన యాకహారము గొన, గలుగమి నిచ్చిలువ నొచ్చెగద యకటకటా.

367


క.

భారవహం బిది లే దా, హారము నే నిడక కటికి యాఁకట నిపుడే
కారెడు నిట్లుండిన నా, యారోహణకేళి యేక్రియం గొనసాగున్.

368


చ.

అని తలపోసి మందవిదు నారసి యజ్ఞలపాదుఁ డిట్లనున్
ననుఁ దలఁదాల్చి యాడజవనంబువలెం జఠరానలంబు రాఁ
జినయపుడెల్ల గప్పల విశృంఖలవృత్తి భుజించి లావుగై
కొని విహరింపు భోగికులకుంజరనాదములన్ హ్రదంబునన్.

369


వ.

అని నిరప్పణగాఁ గప్పలఱేఁడు సెలవిచ్చిన బలవంత మగుట నీరంబున ననర్గళ
ప్రచారంబునం బేరెంబులు వాఱుచు నొడిసియొడిసి బడలుపడం గఱిచి కిచుకు
కిచుకురనక కతిపయదినంబులకు జలపాదావశేషంబుగా నిఖిలభేకంబులం భక్షించి.

370


క.

తల నంటి పట్టుకొని చి, ప్పలు విరిగి వడంకుచున్నవాని నహో య
జ్ఞలపాదు విడిచి రోషా, విలమానసుఁ డగుచు మందవిదుఁ డిట్లనియెన్.

371