Jump to content

పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దెస నాదరణంబు సేయండయ్యెఁ గాలపక్వంబును నట్టిద.

336


క.

జనియింపం గలకార్యము, మనమున దగ నిశ్చయించి మంత్రి సునీతిన్
వినిపించిన విననొల్లని, చెనఁటికి ముకుబంటిగాదె చేటుంబాటున్.

337


తే.

గగనమంటిన దోషాగ్ని గాఢశాంతి, నీరమున శీతలము సేయ నేర్చుమంత్రి.
చిరహితారంభపరుఁ డైనసేవకుండుఁ, కార్యనిర్వాహకులు సూవె కరటముఖ్యా.

338


క.

తానెంత కార్యపారగుఁ, డైన రహస్యమున మంత్రి నడుగక ధరణీ
జానకి నేకార్యంబుం, బూనందగ దుద్ధత ప్రభుత్వప్రజ్ఞన్.

339


ఉ.

ముప్పదిమూఁడుగోటుల సుమూర్తుల వేల్పుల నేలువజ్రి య
ప్పప్ప యవార్యశౌర్యకరుణాదులకుట్టున నించుకేనియున్
జెప్పనివాఁడె యట్టినయశాలి బృహస్పతిగోపనంబునం
జెప్పిన పంపుసేయక విశృంఖలవృత్తిఁ జరింపనేర్చునే.

340


క.

కావున రక్తాక్షుఁడు నయ, కోవిదుఁ డమ్మంత్రిమాట గురుమంత్రముగా
భావింపలేక కోటఁడు, పావకకీలాళిఁ గాలి భస్మంబయ్యెన్.

341


చ.

అరయఁగ దుష్టమంత్రినివహం బనువారము గల్గియుండ నే
పురుషు ననీతిదోషములు పొందవు రోగము లేయపథ్యబం
ధురుఁ గలఁగింప వేజనునిఁ ద్రుంపదు మృత్యువు లక్ష్మి యెవ్వనిన్
జిరమదగర్వదర్పితునిఁ జేయదు పైకొన వేరి నాపదల్.

342


వ.

లోభికిఁ గీర్తియు ఖలునకు మైత్రియు నష్టశక్రియునకుఁ గులంబును ధనార్జనతత్పరు
నకు ధర్మంబును నలసునకు విద్యయం గృపణునకు సౌఖ్యంబును బ్రమత్తసచివుం
డగు జగతీపతికి రాజ్యంబును లేదు వెండియు నీరసేంధనంబుల వహ్నియు మూర్ఖు
లందు శోకంబును జపలచిత్తులయందు గోపంబును గాంతలందు విత్తంబును
దయావంతులందు ధర్మంబును మహాత్ములయందు ధైర్యంబును వృద్ధిఁబొందు నది
యట్లుండె.

343


క.

వలవగునంతకు బగతుం, దలనిడుకొని తిరుగునీతితత్త్వజ్ఞుఁడు మున్
జిలువయొకం డట్టిదయై, మలుగందినదే యనేకమండూకములన్.

344


క.

అనిన విని మేఘవర్ణుం డనురాగరసాబ్ధి నోలలాడుచు విద్యా
ఖనికా యె ట్లీకథ చెపు, మను డచ్చిరజీవి వాయసాగ్రణి కనియెన్.

345


సీ.

విను పూర్వమున మందవిదుఁ డనుకాలాహి యాహారకాంక్ష నహర్ముఖమున
బఱచి యొండొకచోట బహుభేకకలకలప్రతిభిన్నసకలదిగ్భాగమైన
హ్రదము గన్గొని లోనికరుగ నెద్దిక్కున దెరువు గానక తీరధరణి నిల్చి
కుంభిని ఫణ మూదికొని డిక్లచెడినట్లు పరవశుగతి రుగ్ణుపగిది నుండఁ