పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కారతఁ గాలకాంక్ష పొసఁగ న్నిజకార్య మొనర్చుగాండివ
జ్యారవదేవదత్తరభసక్షుభితాష్టహరిత్కరిశ్రుతి
ద్వారుఁడు గ్రీడి మత్స్యపురి నాఁడు బృహన్నలయై నటింపఁడే.

328


చ.

ఒకదెసఁ గార్యదాహమున నుండక యేరికినైనఁ దీఱ దం
తకవిభసత్యుఁ డాదరణధామకటాక్షుఁ డఖండవిక్రమా
ధికుఁడు విలాసవిశ్రమణదేశము మాద్రికిఁ దొల్తపుత్రుఁ డా
నకులుఁడు మత్స్యరాజభవనంటున సాహిణియై చరింపఁడే.

329


చ.

భుజబలశాలి నీతిపరిపూర్ణుఁడు రూపవిలాసవారిజ
ధ్వజుఁడు హరిజ్జయాభిముఖదర్పుఁ డతిప్రియభాషుఁ డాశ్రిత
ద్విజనిధి కార్యదాహనిరతి న్నిజవేషముఁ గప్పిపుచ్చి గో
వ్రజములఁ గాచువాఁడయి విరాటుపురి న్సహదేవుఁ డుండఁడే.

330


ఉ.

కాలము దాఁట నెవ్వ రిల గాల్గలవారలు వారివాశికీ
లాలపరీతభూతవిపులానృపరాజముఖీశిరస్ధల
స్థాలఘురత్నభానునికషాతిసమున్మిపదంఘ్రిపద్మ పాం
చాలతనూజ తొత్తుపని సల్పదె దైవగతి న్సుధేష్ణకున్.

331


వ.

అని చెప్పి బాష్పనిష్పీడితాక్షుండై వాయసాధ్యక్షుండు చిరజీవి నాలోకించి.

332


క.

పరదేశ మఖిలదుఃఖా, కరము మదీయోపదేశగమ్యుఁడవై కా
ర్యరభసము కోర్చి రిపుమం, దిరమున నెబ్భంగి నుండితివి చిరజీవీ.

333


క.

ఘూకములు దెగడ ఘూక, క్ష్మాకాంతుఁడు గౌరవంబు సలుపఁగ బ్రతిప
క్షౌకమున నుంటి విద్దశ, నాకతమున నీకుఁ గలిగెనా చిరజీవీ.

334


సీ.

అని విన్ననయిన వాయసరాజు నీక్షించి యచ్చిరజీవి యిట్లనియె మఱ్ఱి
తరువున నీయాజ్ఞఁ దలమోచి యేనుండుతఱి మదాంధదివాంధతతులు వచ్చి
కెలఁకు లీక్షించి మీపొలకువ లేకున్న తెరలి వచ్చినత్రోవ మరలి చనఁగ
నున్నక న్నెఱిఁగి నే నొకశబ్ద మొనరించి క్రమ్మఱించితిఁ గార్యకరణబుద్ధి


ఆ.

నపుడు వికృతమూర్తినైయున్నన న్నులూ, కములు గాంచి యెఱుఁగుఁ గానఁ దొలుత
నింపుకలిమి సంహరింపక నొంపక, నాదరమున భర్త కప్పగించె.

335


వ.

అప్పుడు ఘూకవల్లభుండు నన్నుం జూచి నీ వెవ్వండవని యడిగిన మేఘవర్ణు
నకు ముఖ్యదండనాథుండ నగు చిరజీవి నని చెప్పితి నప్పలుకులు విని మంత్రుల రా
వించి మంత్రికూటంబున నన్నుం జూపి యితని కుచితం బగుకార్యం బొకరొకరు
చెప్పుం డనిన నందు రక్తాక్షుం డనువాఁ డొక్కరుండు దక్కఁ దక్కినవారందఱు
నాపక్షంబ పలికిరి రాజును వారివాక్యంబు లంగీకరించి నీతిదక్షుం డగు రక్తాక్షుని