పుట:నృసింహపురాణము.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

75


ఉ.

ఓయి సమీర! యీఖలు దురుక్తిధురంధరు శత్రుపక్షసం
ధాయకు మాయలాని సముదగ్రజవంబునఁ దాఁకి వీనిదు
ష్కాయముఁ జొచ్చి ధాతువుల గ్రాఁచి వెసం బెనుపట్టుకట్టఁగాఁ
జేయుము నీదుశోషణవిశేషణనైపుణికల్మి యేర్పడన్.

147


వ.

అని పనిచినం బనిఫూని సంశోషణాభిధానుం డగునప్పవమానుం డాదైత్యరాజసూను
శరీరంబుఁ బ్రవేశించి నిజవ్యాపారవికారంబులు గావింపందొడంగిన.

148


ఉ.

హానియు వృద్ధియున్ బొరయ కస్తసమస్తవికారుఁ డైనల
క్ష్మీనిధిమేదినీధరునిఁ జిత్తమునందు ధరించియున్న మే
ధానిధి యయ్యశోనిధి కృతస్మితచారుముఖారవిందుఁ డై
తా నొకయీసులేక ప్రమదంబున నుండె నకంపితస్థితిన్.

149


ఉ.

అంతఁ దదీయహృద్గతుఁ డనంతుఁ డనంతదయాంతరంగుఁ డ
త్యంతవిభూతి నప్పవనమంతయుఁ గ్రోలిన గృత్తిమూలమై
యంతటఁ బే రడంగె నది యాత్మఁ బ్రమోదము పొందె లోక మే
కాంతవివేకులమ్ వికృతులందునె యెందును నెవ్విధంబునన్.

150


వ.

అసురేశ్వరుండును నసమానలజ్జాకందళితాంతరంగుఁ డగుచు నభ్యంతరంబునకుం జని
యె. నంత ప్రహ్లాదుండునుం గురుగృహంబునకుం జని పూర్వప్రకారంబునం జదువు
చుండె. నాచార్యుం డతనికిం గ్రమంబున భార్గవప్రణీతం బైననీతితంత్రంబు సకలం
బును నపగతంబు గావించి యతనిశాస్త్రపారీణత్వంబు దృఢంబుగా నెఱింగి
యొక్కనాఁడు హిరణ్యకశిపుపాలికిం జని యిట్లనియె.

151


చ.

పవలును రేలు దు:ఖపడి బాలుని నొయ్యన బుజ్జగించి దా
నవకులనాథ! యేను జతనంబునఁ జెప్పితి రాజనీతివై
భవపరిబోధకారి యగుభార్గవసూక్తమహార్థతంత్రమం
త్రవికలబుద్ధి నీకొడుకు దాఁ దుదముట్టె నుదాత్తవిద్యలన్.

152


వ.

అనిన సంతసిల్లి తండ్రి కొడుకు నాప్రొద్దు రావించి చేరువ నునుచుకొని యన్నా! నిన్ను
మీయొజ్జ నయకళాపారంగతుంగా నుదాహరించినది మాకుం దెల్లంబుగా నెఱుంగవల
యు, రాజులకు మిత్రు లమిత్రులు నుదాసీనులను మూఁడుదెఱంగులవారలు గలరు, వా
రలయందు భూపతి యెట్టియెడల బ్రవర్తిల్లు, నభ్యంతరులు బాహ్యులు నగునమా
త్యులయెడ నెవ్విధంబులవాఁడు గాఁదగుఁ, జారసంచారంబును బౌరజానపదజనాను
లాపనంబు నేలాగునం జెల్లించు, విశ్వాసుల నవిశ్వాసుల నెట్లు గనుఁగొనుఁ, గార్యం
బు నకార్యంబు నేవెరవున నిర్ణయించు, దుర్గంబు లేమియయి సవరించు, నరణ్యశోధ
నులగుదక్షకిరాతాదుల నేమాడ్కి నియమించు, గంటకుల నేభంగి భంగించు నివియు