పుట:నృసింహపురాణము.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

చతుర్థాశ్వాసము

శ్రీకాంతాపరిరంభా
లోకాతిక్రమవివేకలోలుపలభ్యా
శ్రీకరనామస్మరణో
త్సేకదళితవినమదంహ శ్రీనరసింహా.

1


వ.

దేవా రోమహర్షణుండు మహర్షుల కి ట్లనియె. ని వ్విధంబున నాశ్చర్యభావుం డైన
యమ్మహానుభావుచరితంబులు భాషితంబులు నంత యెఱుంగనిరాజసంబున నాదైత్య
రాజు కేవలవాత్సల్యపరవశుండై యబ్బాలు బాల్యోచితంబు లైనయుపలాలనంబుల
గారవింపుచుండె. తల్లియుం గొడుకుచందంబులు డెందంబున కానందంబు నొందిం
ప నిజస్వప్నదర్శనంబుతెఱుంగును గురువాక్యప్రకారంబుతెఱంగును దలఁచి వెక్క
సంబందుచు నెయ్యది గానున్నదో యని వెడ దలంకుచు పంకజోదరచరణస్మరణలా
లసంబగుమానసంబుతోడం బ్రవరిల్లెఁ. దదనంతరంబ.

2


సీ.

చౌలమౌంజీబంధసంస్కారములు యథాకాలకల్పితములుగా నొనర్చు
తేజోవిశేషసందీప్తుఁ డై యొప్పి యప్పాపఁడు జనకునిపంపువలన
విద్యాపరిగ్రహవినయదీక్షలకునై పూజితగురుగృహంబున వసించి
దైత్యదానవకులోత్తంసంబు లగుతనయీడుబాలురతోడఁ గూడి చదువుఁ


ఆ.

జదువుచుండఁ గొంత చనియె కాలం బంత, నొక్కనాఁడు దండ్రి యుల్ల మలరఁ
గొడుకుచదువు వినఁగఁ గోరి కుమారు నొ, జ్జలను గారవమునఁ బిలువఁ బంచె.

3


వ.

ఇట్లు రావించినం జనుదెంచి మదిరాపానగోష్ఠీసమయంబున ననేకవిలాసినీపరివృ
తుండై యున్నజనకునిం గని నమస్కరించి యుపాధ్యాయసహితంబుగా నంతంత
నాసీనుండై యున్నపుత్రునకు నసురేశ్వరుం డి ట్లనియె.

4


ఉ.

పాపఁడ యింతకాలమును బాయక యొజ్జలయొద్దనుండి ని
వేపగిదిన్ బఠించి తది యేర్పడం బ్రస్ఫురితార్థసార మై