పుట:నృసింహపురాణము.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58

నృసింహపురాణము


గీ.

అఖిలగుణరత్నములకు నాయతన మనఁగ, భువనభూషణంబననొప్పు పుత్రుఁ దాల్చి
యున్ననాకేల తొడవులొండన్నకరణి, నబల గై సేయు పనులయం దలసయయ్యె.

133


చ.

అనుపమయోగలీల నమృతాంబుధియందు శయించుదేవు నె
మ్మనమున నావహించి యసమానసమంచితయోగసుప్తిమై
నెనసినబాలుఁ జూలున వహించిన సంతతసద్గుణైకవా
సననొ నిరంతరంబు గడుఁ జామకు జాడ్యము దోఁచుఁ జెయ్వులన్.

134


సీ.

హరినామకీర్తన పరమోత్సవంబులఁ గావింప ననిశంబు కాంక్ష సేయు
విష్ణుదాసులఁ గని వేడ్క నంజలి చేసి కొనియాడి భక్తిమైఁ గొలువఁ గోరం
బరమాత్ముమహిమలు భావించి భావించి యానందజలధి నోలాడఁ దివురు
నారాయణునియవతారకథాసుధాలీలలు వీనులఁ గ్రోలఁ దలఁచుఁ


గీ.

దనువు ప్రాణంబు నచ్యుతార్థంబుగా న, మర్పఁగా నెంచు జగములు మహితకరుణ
నెపుడు రక్షింపఁగా నుత్సహించుచెలువ, బుద్ధి యంతర్గతుం డగుపుత్రువలన.

135


వ.

ఇట్లు ప్రతిదినప్రవర్ధమానగర్భలావణ్యలలితయైన హృదయేశ్వరిం గనుంగొని యసు
రేశ్వరుండు హర్షవికాసవిలసితాంతరంగుం డగుచుఁ బరమోత్సవంబున భార్గవనిరూ
పితప్రకారంబున గారవంబు మిగులఁ బుంసవనసీమంతాదికలాపంబులు నిర్వర్తించి
యనంతరంబ సముచితసమయంబునందు.

136


సీ.

అమృతాంబునిధిసముదంచితవీచిక కుదయించుతుహినమయూఖుఁ డనఁగఁ
జారుపురందరాశానితంబిని కుద్భవించుసరోజినీవిభుఁ డనంగ
విలసితరోహణాచలఖనిభూమికిఁ బ్రభవించుమహనీయరత్న మనఁగ
సుందరనూతనమందారలతికకు జనియించుసురుచిరస్తబక మనఁగఁ


గీ.

గాంతియును తేజమును మహార్ఘతయు సౌకు, మార్యమును నభిరామసామగ్రి బొదలఁ
బుత్త్రుఁ డుదయించెఁ ద్రైలోక్యభూతికరుఁడు, రాజబింబాస్య యగుదైత్యరాజసతికి.

137


క.

పుత్త్రోదయమున నిర్జర, జైత్రుఁడు మునుకొన్న యధికసమ్మదమున లో
కత్రయరాజ్యము మును నిర, మిత్రముగా గనినకంటె మిక్కిలి పొంగెన్.

138


సీ.

పుప్పోపహారము ల్పొలుపారఁ బురమునఁ గావింపుఁ డనుమాటకంటె మొదల
మంగళవాదిత్రసాంగత్యభంగులు గలిగింపుఁ డనుమాట కంటె మొదల
భాసురవైజయంతీసహస్రంబులు గలిగింపుఁ డనుమాటకంటె మొదల
నిపుణవిలాసినీనివహసంచారంబు ఘటియింపుఁ డనుమాటకంటె మొదల


గీ.

దివ్యకుసుమవర్షంబులు దేవదుందు, భిస్వనంబును నప్సరోభినయగతులు
కల్పభూరుహాంబరపతాకలు దనర్చె, భువనహితజన్ముఁ డగుఁబోలు భూరిమహిమ.

139


క.

అవి యెల్లఁ గని సురద్విషుఁ, డవివేకమనస్కుఁ డగుచు నౌర మదీయో
త్సవమునకుఁ దగ నొనర్చిరి, దివిజులు పను లనుచుఁ దనమదిన్ ప్రియ మందెన్.

140