పుట:నృసింహపురాణము.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

29


వ.

చనుఁ డసురేంద్రుఁ డున్న వికచద్దృమపుష్పసుగంధిగంధమా
దనవనభూమికిన్ భవదుదంచితయోగ్యసహాయలీ కై
పనిచెద నీక్షణంబ మధుపవ్రజకోకిలకీరమీనకే
తనమధుమానసాస్పదసుధాకరదక్షిణమారుతంబులన్.

54


వ.

అనిన నయ్యింతు లందఱు నట్లకాక యియ్యకొని రప్పుడు తిలోత్తమ యయ్య
మరోత్తమున కి ట్లనియె.

55


సీ.

ఏను గ్రీఁగంట నొక్కించుక చూచిన ఖలుడెంద మైనను గరఁగు ననిన
నాయింపుఁబలుకు కర్ణములు సోఁకినఁ బితామహుఁ డైన జదువులు మఱచు ననిన
నేను దియ్యమున నటించిన హరుఁ డైన మరునికన్నులసన్న దఱుగు ననిన
నారూపు చూచిన శౌరియు నహితల్ప ముడిఁగి పల్లవశయ్యఁ బొరలు ననిన


గీ.

నరతి యైనఁ దాల్మి యను కైన నుల్లంబు, చులక నైనఁ దసము లులక నైన
నేమములతపంబు నిల్చునె నాయెదు, రెదుర నధిప మాట లేల యింక.

56


క.

చూచెదవు గాక యే నిటు, చూచిన నయ్యసురతపము సొంపఱి వ్రతిని
ష్ఠాచరణము తూపర మగు, గోచరమై మనసు త్రిప్పుకొని సోలంగన్.

57


వ.

అని పంతంబులు పలికిన యమ్మగువమాటకు మరున్నాయకుండు మనంబునం బ్రమ
దంబు నొందె. నయ్యిందువదన లందఱు పురందరు వీడ్కొని చని గంధమాదనంబుఁ
జొచ్చిరంత.

58


క.

వారలతోడనె యాత్మ, స్ఫారవిభవ మెల్లఁ గొని వసంతుడు దనయా
కారంబుఁ జూపె నక్కాం, తారంబున శిశిరసమయదర్పావహుఁ డై.

59


చ.

ఇదె చనుదెంచెఁ జైత్రుఁ డని యెల్లవనంబులకుం బ్రమోదముల్
పొదలఁగ మేనివార్త గొని బోరున వచ్చిన దాడికాఁ డన
న్మృదువనదేవతాముఖసమీర మెదుర్కొన నుల్లసిల్లె నిం
పొదవఁగ దక్షిణానిల మనూనమనోహరఖేలనంబునన్.

60


ఉ.

పండినమ్రాకు డుల్లి నవపల్లవముల్ తిలకింపఁ బూఁబొదల్
నిండఁగఁబర్వె లేఁగొనలు నిద్దములై నిగుడంగ మ్రాకు లొం
డొండఁ దలిర్చె నామని సముజ్జ్వలయోగరసాదనక్రియన్
గొండికపాయముల్ మగుడఁ గోరి భజించినసిద్ధులో యనన్.

60


ఉ.

ఎందును బుష్పసౌరభమ యెందును మందమదాలిఝంకృతుల్
ఎందును సాంద్రపల్లవము లెందును గోకిలకంఠకూజితం
బెందును విస్ఫురత్ఫలము లెందును గోమలకీరభాషితం
బందము లయ్యె మందమరుదంచితచారువనాంతరంబులన్.

61


తే.

సరసకింశుకకోరకసంచయంబు, చెలువు తిలకించె భావినృసింహదేవు