పుట:నృసింహపురాణము.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

25


నిర్ఘాతోత్పాతవిద్యున్నికరము లడగన్ నిర్వికారుండు ధైర్యం
బర్ఘాతీతంబుగా నయ్యసురవరుఁడు వర్షాగమం బట్లు పుచ్చెన్.

18


క.

పదపడి హేమంతునిసం, పద యొయ్యున శీతగిరి యుపాంతమువలనం
గదలి చనుదెంచుపయ్యన, నొదవి తనమయంబ యగుచు నొప్పుగఁ బర్వెన్.

19


ఉ.

ఒక్కట మైహికంబు లగు నుత్తరమారుతము ల్శరీరముల్
వ్రక్కలు సేయ నేతెఱఁగువారికి నోర్వఁగరానిరాత్రులన్
బుక్కిటిఁబంటినీటఁ బరిపూర్ణఘనస్థితి నిల్చి దానవుం
డక్కజ మైననిష్ఠఁ గొనియాడఁగఁ బట్టుగఁ బొల్చె నెంతయున్.

20


సీ.

దనుజఘోరతపోగ్రతకుఁ దలంకినమాడ్కిఁ గమలిననెత్తమ్మి కన్నుమూయ
వ్రతమువేఁడిమినెమ్ము దితిజుమేనికి నోడు క్రమమునఁ గడలుఁ దీరమున కొదుఁగ
నసురవెచ్చనియూర్పు లడరెడునింకెడు నీటి మారసమంచు నీరు గురియ
జలదేవతలు చైత్యుకలితనం బగ్గించు సెలగున సారసోక్తులు చెలంగ


గీ.

దివిజవైరితమము తెఱఁగెల్లఁ గంటికి, నిదురలేక చూచునదియుఁబోలె
వికచకుముదనేత్రవిభవయై చె, న్నొందె దానవేంద్రుఁ డున్నసరసి.

21


వ.

మఱియు నమ్మహావ్రతుండు తపోవిశేషాభిలాషంబు దనకుం బరిపోషణం బొనరింప
నిర్దోషహృదయుండై కడంగి.

22


తే.

వేళ్లదిండ్ల గూరలఁ గొంత నీళ్లఁ గొంత, గారవమునఁ దపోయాత్రఁ గోరి నడపె
గాడ్పు గ్రోలుచు మఱికొంతకాల ముండె, వెండి యాచందమునన దా విస్మయముగ.

23


వ.

ఇవ్విధంబున ననేకసంవత్సరంబులు ధీరవ్రతాచారుండై యున్నయాదైతేయతా
పసుతపంబుపెంపునకుం దలంకి పురందరుండు దేవగురునాశ్రమంబునకుం జని నమ
స్కరించి యతనిచేత నాశీర్వచనంబుల నభినందితుం డై యి ట్లనియె.

24


మ.

జనకుం డొక్కఁడ వేఱుతల్లులు జగత్సామ్రాజ్యపూజ్యస్థితుల్
దనకుం బా లనుచున్ సమత్సరమతిన్ దైతేయుఁ డత్యుగ్రద
ర్శనదుర్వారతపస్కుఁ డయ్యెఁ గరుణాసంపన్నుఁడౌ దాతప
ట్టునఁ బ్రత్యక్షత నొంది మత్పదవి వేఁడున్ వాఁడు నెబ్భంగులన్.

25


క.

అసురతపంబు జగంబుల, కసహ్యమై యునికిఁజేసి యంబుజభవుఁడున్
వెసఁ దత్ప్రశమనమునకై, యసంశయము దివిజరాజ్య మతనికి నొసఁగున్.

26


క.

నిను నాశ్రయించియును నే, ననఘా కడలేనివనట యనువననిధిలో
మునుఁగుదునె ప్రతీకారం, బొనరింపఁగదయ్య దీని కూహించి కృపన్.

27


చ.

అనుటయు దేవమంత్రి దరహాసముతో దివిజేంద్రుఁ జూచి యి
ట్లను నిది యేమి భీతిలఁగ నంచితసత్యతపోనిరూఢి నీ