పుట:నృసింహపురాణము.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

21


దురితాంధకారంబు పరఁగిక్రమ్మినచోటఁ బటుభానురుచి బ్రహ్మభాషితంబు
దుఃఖభయంబులు దొడరి సోఁకినచోట నభయమంత్రము బ్రాహ్మణాశ్రయంబు


గీ.

సారభద్ర ముత్తమవర్ణచరణరజము, భవ్యతీర్థంబు బాడబపాదజలము
సకలజన్మంబులకు నగ్రజన్మకులము, చేరుచో టిది సిద్ధాంతసిద్ధమతము.

97


శా.

నారూపంబులు మేదినీసురలు నానారూపదీప్యత్తప
స్సారోదారులు భూరితేజులు జగత్సంభావ్యకోటిప్రసా
దారంభప్రతిభావిభాసితులు విశ్వాధారు లామ్నాయసం
స్కారాకారులు లోకసమ్మతయశోగంభీరతాజృంభితుల్.

98


క.

దైవాధీనము త్రిజగము, దైవము తన్మంత్రవశము తన్మంత్రము భూ
దేవతలచేతి దగుటను, దైవములకు దైవతములు ధరణీదివిజుల్.

99


ఆ.

బ్రాహ్మణావమానపరు లైనవారలు, నన్ను నాత్మనొల్లకున్నవారు
విప్రవరులఁ గరము వేడుఁ బాటించు, వార లెల్ల నన్ను వలచువారు.

100


వ.

కావున బ్రాహ్మణవచనాతిక్రమణం బొనరించిక జన్మాంతరంబులు గైకొనవలము, నతి
మాత్రశత్రుత్వంబునకు ననుమానింపవల దదియు నుదాత్తప్రదంబ, యట్లని శత్రుం
డు నిరంతరంబు మద్గతం బైనహృదయంబునం దస్మదీయసాదృశ్యంబు తనకు గావల
యుటం దలంచుటఁ దత్ప్రకారంబు సాయుజ్యసంపత్కారంబు మీరు చిరకాలంబు
నన్ను భజియించినదాసు లగుటంజేసి పరమైశ్వర్యభాజనంబులగుజన్మంబులఁ దేజో
విభవంబు లనుభవించి తుది నస్మదైక్యంబు నొందంగలవార లిదియంతయు నేను
మాయాబలంబున మీకు శ్రేయఃకారణంబులుగా నుత్సాదించిన యుపాయంబు సన
కాదులకాదు శర్వుం డైనమద్భక్తజనంబుల ధిక్కరింప శక్తుం డగునె? యిత్తెఱంగు
మాంగళ్యంబుగా నంగీకరించునది, యంతరంగంబుల కలంకదొలంగుఁ డని యానతిచ్చి
వెండియు ని ట్లనియె.

101


మ.

పగవాఁ డైనను మూర్ఖచిత్తుఁ డయినన్ బాపాత్ముఁ డైనన్ మదీ
యగుణధ్యానవిధేయధీపరిణతుం డై యున్న నే నాతనిన్
సుగుణుంగా నతిధన్యుఁగా సుజనుఁగా శుద్ధాత్ముఁగా నిత్యుఁగా
జగదేశప్రభుఁగాఁ బ్రభూతవిభవస్ఫారాత్ముఁగాఁ జేయుదున్.

102


శా.

ఏ నెవ్వాఁడనొ నాచరిత్రముతెఱం గెబ్బంగియో మన్మయ
ధ్యానం బెట్టిదియో యెఱుంగని విమూఢాత్ముండు మన్నామ మె
ట్లైనం బేర్కొనఁ గాంచునేని దురితోదగ్రాంధకారచ్ఛటా
భానుం డీతఁ డనంగ భవ్యపదముం బ్రాపించువాఁడునా మదిన్.

103


క.

నారాయణాఖ్యుఁ డగుసుతుఁ, బేరుకొనినబోయ కెట్టిపెం పొదవెను వాఁ