పుట:నృసింహపురాణము.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

నృసింహపురాణము


క్ష్మీవిభుమీఁదిమచ్చరము కిన్కయుఁ గాఱియఁ బెట్టుఁగాత మీ
భావము లిప్పు డేపగిది బాములు పెక్కగు నిక్క మెంతయున్.

89


వ.

అని వారు ఘోరంబుగా శపించిన.

90


క.

వెఱగుపడి హర్షరాగము, దఱకిన వదనములు వెల్లఁదనము గదుర బి
ట్టఱమూర్ఛ మునిఁగి యయ్యి, ద్దఱు నిలిచిన వేత్రదండతాడితతనులై.

91


వ.

ఆసమయంబున.

92


సీ.

ఇమ్మహాపురుముల కెంతమాత్రకుఁ గాఁగ నేలకో యీకోప మిట్లు పుట్టె
నమృతాంశదీధితు లగ్గి సల్లుట గాదె యీమూర్తులకుఁ గన నిట్లు కలిమి
యూహింపఁగాఁ గార్య మొకటి యేమేనియుఁ కలుగునూరక వీర లలుగువారె
సాత్వికు లై యిట్లు సైచిరిగాక యాయిద్దఱు నల్పులే యిద్ధమహిమ


గీ.

ననుచు మునులును సిద్ధులు నమరవరులు, నాదిగా నెల్లవారలు నచట నచటఁ
గూడి పెక్కుభంగుల మాట లాడుచుండ, దుముల మంబునిధిధ్వానసమతఁ బేర్చె.

93


వ.

ఆవృత్తాంతం బంతయుఁ దనదివ్యచిత్తంబున నవధరించి సకలజగన్నివాసుం డగువా
సుదేవుండు లక్ష్మీసహితంబుగా ససంభ్రమంబున నచ్చోటికి విజయము చేసి సనకాదు
లం జూచి మీరు సకలలోకద్వారంబుల ననివారితసంచారులకు వీరు చేసినతప్పు
నాయది యుపశమంబు నొందుండని యనునయించిన నయ్యోగీశ్వరులు మహాయో
గీశ్వరేశ్వరుండైన లక్ష్మీశ్వరుసందర్శనంబును సంభాషణంబునుం గని కృతార్థులై పర
మానందంబునఁ దదామంత్రణంబు వడసి నిజేచ్ఛం జనిరి. మధుమథనుండును మగిడి
యభ్యంతరమందిరంబునగుం జని వైనతేయుం బనిచి ప్రతీహారపాలురం దనపాలికి
రావించిన నయ్యిరువురుం బురాణపురుషునకుఁ బరమభక్తిప్రకారంబు లగు సాష్టాం
గదండప్రణామంబు లాచరించి కృతాంజలు లై యొక్కదెస నొదిఁగి నిలిచిన నప్పర
మాత్ముండు బహుళకారుణ్యపుణ్యావలోకనసాధాసారంబు వారలపైఁ బరపి దరహాస
ప్రసాదసాదరవదనుండగుచు నిట్లనియె.

94


క.

మీఱినమౌనులకినుకకు, మా ఱలుగక యున్న మీసమగ్రక్షమ వే
మాఱుఁ గొనియాడఁగాఁ దగు, గీఱునె సాత్వికులబుద్ధి కిల్బిషచయముల్.

95


ఉ.

ఎంతఁ గొఱంతఁ జేసియు మహీసురముఖ్యులు నాకుఁ జూడఁగా
నెంతటివారి కైనను సహింపఁగఁ బాత్రకు లమ్మహాత్ములం
దెంతటిపూజ్యు లైనఁ దగు నెంతటినున్నననైన నొప్పుఁ దా
రెంతలుగా మదిం దలఁతురేనియు నంతయుఁ దత్ప్రభావముల్.

96


సీ.

అజ్ఞానరోగంబు లలఁతబెట్టెడుచోట దివ్యౌషధంబు భూదేవసేవ
పురుషార్థసిద్ధులఁ బొందెడుచోటను, నమరభూరుహము విప్రార్చనంబు