పుట:నీతి రత్నాకరము.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొదటి వీచిక.

సంచరించు చుండెను. కులవృత్తి భగవద్దూపముగాఁ దలంచుచు దాని సనుసరించినఁ గృతార్థునిం జేయు సని పెద్ద లందురు.

శ్రీనివాసదాసునకు నాలుగుసంవత్సరముల దనుక సంతానము లేకుండెను. కళత్రము మనసున నించుక విచార మూనుచుండెను. పతికి నెదురాడనోడునట్టి శీలముకలది. కావున బయలుపడనీయక యుండెను. ఎట్టులో యా ఖేదమును భర్త యెఱిం గెను. సత్కళత్రము చింత దీర్చుట పతికి హితముగదా యని సన్మతి నాలోచించి యిట్లు తలపోయఁ జొచ్చెను. మానుషానంద మెల్ల రకుఁ గావలసినదియే. దానిం గాంక్షించుట పొరపాటు గాదు. ధన ప్రజావృధ్యర్ధము కదా వివాహము చేసికొనుట. దీనికిఁ బురాకృతపుణ్యము తోడు పడవలయు దానికి మానవ ప్రయత్నము కూడఁ గావలయును. దైవపరులు కొందఱు మానన ప్రయత్న మేలయందురు. అది పాటింపఁదగినమాట యనవలయును. భగవంతుని సేవించుట ప్రధానము. దాన నిహపరములు గలవు. దాని మాన నీ రెండును జెడును. కాఁబట్టి యీశ్వరు నారాధించు టుచితము. ఆ యారాధనము కూడఁ దొలుదొలుత విశ్వాసమును బుట్టించునదిగ నుండవలయుఁ గదా. లేనిచో స్త్రీలకు భక్తి కుదరదు. ధర్మార్ధకామమోక్షములను పురుషార్థములు నాలుగు వాంఛింపదగినవే యని పురాణములు తెలుపుచున్నవి. కనుక నిపుడు శ్రీకృష్ణునారాధించుట యెంతయుఁ దగియుండెను. అందుకు సంతాన గోపాలనామమున శ్రీకృష్ణు నారాధిఁ చుట సమంచితమగు. ఈనామమును విన్నయంతనే నాకళత్రము