పుట:నవంబర్ నెల 2020, అమ్మనుడి మాసపత్రిక.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంపుటి :6 సంచిక; 6 ఆచార్యుని ణమ్మునుచె తలుకులు నవంబరు 2020

అమ్మనుడులే బడినుడులుగా ఉండాలి

జీవ పరిణామ క్రమంలో భాష పుట్టుక ఒక విప్లవం. మానవుణ్ణి మహోన్నతుణ్ణి చేసినది తను మాట్లాడే భాషే ఈ నేలపై పుట్టి పెరిగిన జీవులలో మనిషిదే ఉన్నత స్థానమని అందరికీ తెలుసు. అయితే ఆ మనిషి ఎందుకు అంతగా ఇతర జీవులపై పైచేయి సాధించి కనీ వినీ ఎరుగనటువంటి నాగరికతను సృష్టిస్తున్నాడంటే దానికి జవాబుగా - భాషే దానికి మూలం అని మానవశాస్త్రవేత్తలు అందరూ చెబుతారు. అంటే స్థూలంగా ఈ ప్రకృతిలో మానవుడు సాధించిన అన్ని విజయాలకూ మూలం భాషే మరి, పరిణామ క్రమంలో ఆ భాష మనిషికే ఎందుకు సొంతం ఐనట్టు, ఇన్ని కోట్ల జీవరాసులు ఉండగా. దీనికి జవాబుగా “మానవ మేధస్సే” కారణం అని అటు మేధావులూ ఇటు జీవశాస్రజ్ఞులూ కూడా అంటారు. మానవ మేధస్సు ఇంతగా పరిణితి చెందడానికి కారణం మనిషి మెదడు పరిమాణమే.

మెదడు బరువును బట్టే మనిషి తెలివిగలవాడు అయ్యాడు అంటారు. అయితే పరిణామ క్రమంలో అతి స్థూలకాయం కలిగిన జీవులలో మెదడు కూడా పెద్దదిగానే ఉంటుంది. కానీ ఆ మెదడులో ఎక్కువ భాగం ఆ స్థూలకాయాన్ని సజావుగా నడిపేందుకు పనిచేస్తుంది. జీవశాస్రజ్ఞులు జీవులలో తెలివికి కొలమానంగా జీవుల మెదడు బరువుకీ శరీర బరువుకీ మధ్యనున్న నిష్పత్తిని ప్రమాణంగా _ చెబుతారు. మనుషులలోనూ ఎలుకల్లోనూ ఇది 1: 40 అయితే, చింపాంజీలలో 1: 110, ఏనుగులలో 1: 560గా ఉంది.) అయితే ఈ నిష్ప్రత్తుల సాపేక్షతలో ఎలుకలు మనిషితో పోటీపడుతున్నాయంటారు. మళ్లీ దీనికి జవాబుగా మనిషి తెలివికి కారణం, మెదడుకు ఉన్న అనేక లోతైన ముడతలు ఉన్న పైపొరలే అంటారు. అంటే ఈ లోతైన ముడతల పొరలవలన ఉపరితల వైశాల్యం విపరీతంగా పెరుగుతుంది. ఇట్లా పెరిగిన ఈ ఉపరితల ముడతల పొరలలో ఉండే న్యూరాన్లు అనే కణజాలమే (కార్డెక్స్‌) మనిషి ఇంత తెలివిగా ప్రవర్తించడానికీ పరిణామ క్రమంలో భాషా వికాసం సాధ్యపడటానికీ మూలం అంటారు. ఈ న్యూరాన్‌లే సమాచారాన్ని అందుకోవడమూ పంపిణీ, బైటి నుంచి వచ్చే ప్రేరణలకు స్పందించడం మొదలైన కార్యక్రమాలను నిర్వహిస్తుంటాయి.

మనుషుల్లో గూడా శరీరక బరువూ మెదడు బరువుల నిష్పత్తిలో చాలా తేడాలు ఉన్నా శరీర బరువు ఎక్కువ ఉన్నవారికంటే శరీర బరువు తక్కువ ఉన్నవారు ఎంతో కొంత తెలివిగా ప్రవర్తిస్తారట. ఈ వరవడిలోనే పసిబిడ్డల్లో, చిన్నపిల్లల్లో మెదడు బరువు శరీర బరువుకంటే నిష్పత్తిలో (సుమారుగా 1:10)చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఆ వయసులో వారు పెద్దవారి కంటే తెలివిగా ఉంటారు. అందుచేతనే అతి సంక్షిష్టమైన భాషను ఎవరూ ప్రత్యేకంగా నేర్చకుండానే సులువుగా నేర్చుకోగలుగుతున్నారు. అమ్మ కడుపులో ఉండగానే అమ్మ మాటలకు స్పందిస్తూ అమ్మ నుడికి నేపథ్యాన్ని ఆలకిస్తూ, ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టగానే తల్లిదండ్రుల నుంచీ చుట్టూ ఉన్నవారి నుంచీ అమ్మనుడిలో నేర్పును సాధిస్తాడు. భాష అంటే ఏవో నాలుగు పడికట్టుపదాలతో మాట్లాడగలగటం కాదు. ఆ చిన్న వయసుకే (ఆరేళ్లు) పిల్లలు భాషను అంతర్గతీకరించుకుంటారు. అంటే అమ్మనుడికి తమ మెదళ్లలో వ్యాకరణ నిర్మాణం చేసుకుంటారు. ఈ అమ్మనుడి పునాది పైనే, ఆ తరువాత నేర్చే ఇతర భాషా వ్యాకరణాల నిర్మాణం తేలికఅవుతుందంటారు భాషాశాప్రజ్ఞులు. ఈ ఉపోద్ద్ధాతం అంతా ఎందుకంటే, పిల్లల్లో భాషను నేర్చే శక్తి సామర్ధ్యాలు సమస్త జీవరాసులలో కంటే ఎక్కువ. పిల్లలు భాషలను పుట్టక ముందు నుంచే మొదలుపెట్టి పుట్టిన ఆరు సంవత్సరాలకే అవసరమైన భాషనంతా నేర్చుకొంటున్నారు. ఇట్లా నేర్చిన భాషా పునాదిమీద మరో భాషను నేర్చుకోవడం సులువవుతుంది. ఆ అమ్మనుడే ఆ తరువాత తరగతి గదిలో నేర్చిన

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * నవంబరు-2020

7