పుట:నవంబర్ నెల 2020, అమ్మనుడి మాసపత్రిక.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సాహిత్యరంగం

డా. మధురాంతకం నరేంద్ర 98662 43659

నిరుడు వెలిగిన 'పత్రిక'

“వాట్స్‌ ఆప్‌లో యిటీవల వొక వ్యంగ్య చిత్రం చిందులు తొక్కింది. అందులో పెద్ద గుంపు వో వస్తువిశేషం చుట్టూ చేరి అదేమిటో తెలుసుకోలేక ఆశ్చర్యపడుతూవుంటారు. యింతకూ ఆ వస్తువిశేషం మరేమిటోగాదు. అది వొక పుస్తకం. టీవీలూ, సినిమాలూ, అంతర్జాలమనే మాయా జాలమూ విరుచుక పడడంవల్ల, మనుషులంతా క్రమంగా పుస్తకమనే స్నేహితుడ్ని మరిచిపోతున్నామని ఆ చిత్రకారుడి అభిప్రాయం. పుస్తకమే లేని ప్రపంచమొకటి రాబోతోందని అతని భయం. ఆ చిత్రకారుడు తప్పుకుండా తెలుగువాడే అయివుంటాడు. పుస్తతమన్నదాన్ని మానవజాతి మరిచిపోవడమ న్నదెప్పుడైనా జరిగితే, ముందుగా అది తెలుగు రాష్ట్రాల్లోనే జరిగి తీరుతుంది. అసలే సాహిత్యపత్రిక లేని జాతిగా గొప్ప గుర్తింపు పొందిన తెలుగులో యిటీవల దాదాపు యెనిమిది నెలలుగా ముంచుకొచ్చిన 'కోవిడ్‌ కరోనా” అనే మహమ్మారి దయవల్ల మిగిలిన వోకటి రెండు పత్రికలు గూడా మూతబడిపోయాయి. యిప్పుడు మనం చేయగలిగింది “చేయెత్తి జై కొట్టు తెలుగోడా! గతమే కీర్తిగల వాడా!” అని పాడుకోవడం మాత్రమే!

ప్రచురణ యంత్రాన్ని కనిపెట్టిన తర్వాత పారిశ్రామిక విప్లవం మధ్య తరగతి సంఖ్యను పెంచడంతో బాటూ వాళ్లకు కొంత తీరికను కూడా కలగజేసిన తర్వాత, యూరపులో పత్రికల ప్రచురణకు బాగా వూపొచ్చింది. పుస్తక ప్రచురణా, వార్తాపత్రికల ప్రాచుర్యమూ మానవుల లౌకిక సాహిత్య సాంన్కృతిక జీవితానల్ని ప్రభావించేసాయి. దానితో లోకపు తీరే మారిపోయింది. పుస్తకాలూ, పత్రికలూ లేకపోయివుంటే ప్రపంచం యిప్పుడున్నట్లుగా వుండేదేకాదు.

మద్రాసుకు అచ్చుయంత్రం 1806 ప్రాంతానికే వచ్చింది. కానీ 1880 వరకూ తెలుగు పుస్తకాల ప్రచురణ ప్రారంభం కాలేదని బ్రౌన్‌ మహాశయుడొకచోట చెప్పారు. 1989లో తాను ప్రచురించిన తెలుగు పత్రికల సేవ అనే పుస్తకంలోనయితే తిరుమల రామచంద్రగారు, తెలుగులో వార్తావత్రికా సంప్రదాయం 16వ శతాబ్ద చివరిలో వచ్చిన రాయవాచకం తోనే ప్రారంభమైందంటారు. విశ్వనాధ నాయకుని స్టానాపతి శీ కృష్ణదేవరాయలు దినచర్యను గురించి రాసిన యీ పుస్తకాన్ని పత్రికల ఆరంభమనుకోవడం కేవలం పాక్షికమైన సత్వమేనని గూడా రామచంద్రగారే చెప్తారు.

ఆధునిక సాహిత్య ప్రక్రియలైన కథ, నవల, వ్యాసం అలాగే పత్రికలు, పత్రికారచన అనేది గూడా పాశ్చాత్య ప్రభావంతో వచ్చినదే ననుకోవడంలో తప్పులేదు. ప్రముఖ భాషావేత్త జి.ఎన్‌.రెడ్డి గారు తెలుగులో మొదటి పత్రికగా “కర్నాటక క్రానికల్" ని గుర్తిస్తారు. అది 1832 ప్రాంతంలో వచ్చినట్టుంది. అప్పటి నుంచీ లెక్కబెడితే కొన్ని వందల పత్రికలు తెలుగులో వచ్చి, కొంతకాలం జీవించి, తరువాత మాయమైపోయాయి.

1908 సెప్టెంబరు 8వ తేదీన బొంబాయిలో కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారిచే ఆంధ్రపత్రిక, వారపత్రిక ప్రారంభంగావడం తెలుగు పత్రికల చరిత్రలో బంగారు అక్షరాలతో రాసి గుర్తు పెట్టుకోవలసిన సందర్భం. 1910 నుంచే ఆంధ్రపత్రిక ఉగాది సంచికలను ప్రచురించడం. ఆ సంవత్సరా ప్రత్యేక సంచికలు మొత్తం తెలుగువారి సాహిత్య సాంస్కృతిక వైభవానికంతా ఆవిష్మరాలుగా తయారుగావడం ఆనాడు మధురానుభూతి. 1914లో ఆంధ్రపత్రిక మదరాసుకు తరలిరావడంతో మరొ కొత్త అధ్యాయం ప్రారంభమయింది. అప్పటి నుంచి ఆంధ్రపత్రిక దిన పత్రిక గూడా ప్రారంభమయింది. ఆంధప్రభ వారపథత్రికతో బాటూ కాశీనాధుని నాగేశ్వరరావు గారు 1924లో “భారతి” అనే గొప్ప సాహిత్య సాంస్కృతిక మాసపత్రికను ప్రారంభించడం మరో మరుపురాని సంఘటన. కాశీనాధుని నాగేశ్వరావుగారి తరువాత శివలెంక శంభుప్రసాద్‌ గారి సంపాదకత్వంలో ఆంధ్రపత్రిక, భారతి పత్రికలు ఆధునిక తెలుగు సాహిత్యంలో వోక గొప్ప సవర్ణ భూమికలుగా రూపొందాయి.

1970 ప్రాంతాల్లో తెలుగులో చాలా సాహిత్య సామాజిక పత్రికలుండేవి. ఆంధ్రపత్రిక వార పత్రికతో పాటు ఆంధ్రప్రభ వారపత్రిక కూడా సమాన 'ప్రాచుర్యంతో నడిచేది. ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతిలతో పాటు కొద్ది రోజుల పాటు మాత్రం ఉండిన పొలికేక, ఆదివారం మొదలైన మరికొన్ని వారపత్రికలు వచ్చేవి. యువ, జ్యోతి మాసపత్రికలతో బాటూ విజయ, నీలిమ, తరుణ, విజేత మొదలైన మాసపత్రికలు కొద్దికాలం పాటూ నడిచాయి.

అప్పుడు ఆంధ్రపత్రిక ఉగాది ప్రత్యేక సంచిక వచ్చేది. దీపావళికి యువ, జ్యోతి, ఆంధ్రజ్యోతి నుండి వచ్చే ప్రత్యేక సంచికలు గొప్ప సాహిత్య వార్షిక సంరంభాలుగా వుండేవి. ఆతరువాతి కాలంలో స్వాతి మాసపత్రిక వచ్చి, దానికి కొనసాగింపులా స్వాతి వారపత్రిక కూడా వచ్చి చాలా ప్రాచుర్యాన్ని పొందింది.

ఈనాడు పత్రిక వచ్చాక దానీతో బాటూ చతుర, విపుల అనే మాసపత్రికలు పుట్టాయి. పిల్లల కోసం ప్రత్యేకంగా మొదలైన చందమామ మాసపత్రికది మరొక పెద్ద వైభవం. బాలమిత్ర, బొమ్మరిల్లులతోబాటూ మరికొన్ని బాలల మాసపత్రికలు చాలా వచ్చి కొద్ది సంవత్సరాలపాటూ మనగలిగాయి.

మొత్తం తెలుగు రాష్ట్ర మంతా ప్రాచుర్యంలో ఉండే యీపత్రికలతో బాటు అనేక ప్రాంతీయ వార, మాసపత్రికలు కూడా వుండేవి. ఆ సంఖ్యను లెక్కబెట్టగలిగితే వేలను దాటొచ్చు. కేవలం వార్తలకు, రాజకీయాలకూ, సినిమాలకు, భక్తికీ కూడా ప్రత్యేకమైన చాలా వార మాసపత్రికలు కూడా పుట్టి కొంతకాలం బతికాయి. కేవలం సంచలనాన్ని ఆలంబనగా చేసుకొనే పత్రికలూ కొన్ని వుండేవి. ఆంధ్రప్రదేశ్‌ పేరుతో ప్రభుత్వ పత్రిక ఇటీవల వరకు వచ్చింది.

1991లో ఆంధ్రపత్రిక వారపత్రిక ఆగిపోవటంతో యీ పత్రికల చరమదశ ప్రారంభమైంది. భారతి మాసపత్రిక కూడా ఆప్రాంతంలోనే

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * నవంబరు-2020

46