పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

36

ద్విపద భారతము


బరమపుణ్యులు విష్ణుభాగవతులును
గరిమతో నంతంతఁ గదిసి సేవింప,
భోగికులాధీశు భోగపీఠమున
రాగిల్లు శ్రీ రమారమణితోఁ గూడి

వి ష్ణు సం ద ర్శ న ము



కొలువిచ్చియున్న యాకువలయశ్యాము,
సలలితవికచాంబుజాతాయతాక్షు ,
నిరుపమ మణివిభా నిబిడకిరీటు,
సురుచిర [1]కుండలస్ఫుటగండభాగుఁ,
గౌస్తుభ శ్రీవత్స కలితోరువక్షు,
శస్త పీతాంబరోజ్జ్వల దివ్యదేహుఁ
బొడగని, సాష్టాంగములు భక్తిఁ జేసి,
సడలనిభక్తి హస్తాబ్జముల్ మొగిచి :
"జయ జయ గోవింద, జయ చక్రహస్త,
జయ జయ లక్ష్మీశ, జయగదాపాణి,
నారాయ, ణాచ్యుత, నగధర, కృష్ణ,
వారిజోదర, భక్తవత్సల, శార్ఙ్గి
వైకుంఠ, కేశవ, వరద, మురారి,
లోకేశ, హరి, కృపాలోల, ముకుంద,
యనిరుద్ధ, పాపసంహర, విష్ణుమూర్తి,
వనజాక్ష, కైవల్యపర, వాసుదేవ,
పన్నగశయన, యాపన్నుల మమ్ముఁ
గ్రన్నన రక్షించు కారుణ్యనిలయ!”
అని సన్నుతించు బ్రహ్మాదులఁ జూచి
వనజనాభుఁడు కృపావర్ధిష్ణుఁడగుచు,
చిఱునవ్వుఁ గృపయును జెలగుచూవులను

బెరయంగ జలదగంభీరనాదమునఁ :
  1. గండల (మూ)