పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము

31


కడుకొని ధర్మమార్గంబు దప్పితిరొ !
యెడపక గురునకు నెగ్గొనర్చితిరొ!
అడర విప్రద్వేష మాచరించితిరొ!
వేఁడినయర్థుల వృథగఁ బంపితిరొ!
తవిలి విశ్వాసఘాతక మొనర్చితిరొ!
భువిలోనఁ బూజ్యులపూజ దప్పితిరొ!
ఈలీల మీకేల యిటుచిన్నవోవ!
నాలోకమునను దైన్యము చేటు నగవు
దారిద్య్ర శోకసంతాప[1]వార్ధక్య
దారుణమృత్యుబాధలు చెందరాదు.
ఇందువచ్చియును మీరిందఱు నార్తి
డెందంబులో సందడింపఁ దూలుదురె!
వెఱవక చెప్పుఁ; డేవిధముననైన
మొఱమొఱ మాన్పి మీమెచ్చు గావింతు”,
నని కృపఁబల్కిన, నా బ్రహ్మపలుకు
విని, చిత్రవాక్యప్రవీణను మెఱయ
సరసమానవుఁడు వాచస్పతి యపుడు
కరములు మొగిచి వాక్పతి మ్రోల నిలిచి:
"నిఖలాధినాయక, నీదుచిత్తమున
నఖలలోకములవృత్తాంతంబు లెల్ల
మడవక కరతలామలకము; ల్దెలియఁ
బడయకయుండునె! లోకభర్త! వాణీశ!
ఐనను, దేవ! నీ వడిగితిగాన
నేనెఱింగిన దాని నిట విన్నవింతు".
నని యింద్రుఁ డుర్వి కత్యంతహర్షమునఁ
జనుటయు, దూర్వాసు శపియించుటయును,
అలవడ నాదిమధ్యావసానంబు

దెలుపంగ, విని భారతీయనాయకుండు:
  1. వాధిక (మూ)