పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము

25


ఏ నల్గిచూచిన నీక్షణంబునను
బూని కులాద్రులు పొడిపొడైరాలు;
రవి శశి తారకా గ్రహసమూహంబు
లవలీల నిర్ధూతమై నేలవ్రాలు,
గలఁగి గుల్లలు నిసుకయును శేషించి,
జలనిధులేడు శోషతనొంది యింకు;
జగతియంతయు జీవజాలంబుతోడ
మొగిఁ దిర్గి పాతాళమునఁ గూడియణఁగుఁ ;
బరగ సర్గ స్థితి ప్రత్యవహార
కరులైనమూర్తులు గలగి పాఱుదురు;
పుడమిలోఁగలిగిన భూరికోపంబు
వడఁగట్టి తెచ్చినవాఁడ నేననిన,
నీ వెంతవాఁడవు! నీబలం బెంత!
దేవతావలి యెంత! త్రిజగంబు లెంత!
కొఱవిచేఁ దల గోఁకికొన్నచందమున
నెఱుఁగక నాకు నీ వెగ్గుచేసితివి;
అహహ! మే," లని, యట్టహాసంబు తీవ్ర
దహనకీలాకళాతతిఁ గీడుపఱుపఁ:
"జెడుగ, నీయాచరించిన ఫలంబెల్లఁ
గుడుతువుగా"కని ఘోరవాక్యముల
శతమన్యు నీక్షించి, శాపోదకంబు
లతిభీమగతి నేలనలికి యిట్లనియె:
“నిలమీఁదఁబడినట్టి యీపూలదండ
నలఁగినగతి నీవు నలఁగు సొంపేది.
మాననీయుల నవమానం బొనర్పఁ
గా నీకు మహితమై కడుహెచ్చియున్న
భవదీయరాజ్యసంపదలు, నీభూరి
వివిధపరిచ్ఛేదవిభవంబు లెల్ల,