ఆది పర్వము
19
నరుదుగాఁ బుత్రార్థియై యొక గ్రుడ్డు
తెరలుచు నవియించె దెఱప నేరమిని.
ఆయండమున నొక్కఁ డర్ధశరీరుఁ
డై యుదయించి, తా నతికోపుఁడగుచుఁ :
"గడుపూర్ణ దేహునిఁ గాకుండ నన్ను
నడరుచు నడుమ సండము వ్రక్కలించి
వికలశరీరుఁ గావించితి; గాన,
సకలవిస్ఫూర్తి నీసవతికి నీవు
దాసివిగ;" మ్మని తనుగన్న తల్లి
నీసున శపియించి యిట్లనిపలికె :
అమ్మ, యీ రెండవయండంబునందుఁ
గ్రమ్మనఁబుట్టు సఖండవిక్రముడు
చెలువొంద నీదుదాసీత్వంబుఁ బాపి
వలనొప్ప రక్షించు; వగవకుమింక ;
నయ్యండ మది తానె యవియని"మ్మనుచుఁ
జయ్యనఁజని, యర్క సారథియగుచు
నెమ్మి ననూరుండు నిజశక్తినుండె.
[1]అమ్మగువయును నన్యాండంబు నంత
నతులయత్నమ్మున నరయుచు, మిగుల
జతనంబుగాఁగ నిచ్చలుఁ బ్రోచుచుండె.
కల్పకుసుమదామ ప్రదానము
ఉర్విలో నటమున్నె, యుగ్రకోపనుఁడు
దుర్వాసుఁడనుముని దొరయనేతెంచి
చరియించుచును, నొక సమయంబునందుఁ
దరణితేజుఁడు తిలోత్తమయనుపేరి
- ↑ అమ్మగువయు నంత సయ్యన్యయండ. (మూ )