పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/692

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

626

ద్విపద భారతము.


గురుభీష్మవిదురులఁగూడి నీవరిగి
కరమర్థిఁ దో తెమ్ము కడఁగి పాండవుల
వెరవొప్ప నీవింక విచ్చేయకున్న,
నెఱుఁగుదురే యొరు లీకార్యమునకు
నఱిముఱి." ననవుడు నావిదురుండు
తఱితోడ నపుడట దగ్గఱవచ్చి
ధృతరాష్ట్రుతోడను దెలియనిట్లనియె:
"క్షితినాథ, మిక్కిలి చింతింపనేల!
పటుకృప నీయెడఁ బాండునందనులఁ
దటుకున రప్పించి ధారుణీతలము
పంచిమ్ము సగఁబాలు ప్రఖ్యాతముగను;
వంచించి వారికి వసుధయీకున్న,
మెత్తురే! నిన్నును మేదినిలోన
నుత్తములెల్ల నత్యుచితోక్తి." ననిన
జనపతి విదురుభాషణములు వినియు
వినకుండి, విపినప్రవేశులైనట్టి
పాండవేయుల ధర్మపరుల రావింప
కుండె నుపేక్షించి యొగిఁ గిల్బిషమున.
ద్రోణుండు పాండుపుత్త్రులకు నందఱకుఁ
బ్రాణపదంబయ్యుఁ బస వారివెంట
నరుగఁడ; ద్రుపదరాజాత్మసంభవుని
దురమున మీఁదట దునిమెడికొఱకుఁ
గలశజుఁడుండెను ఘనతరప్రీతి
వెలయంగ ధృతరాష్ట్రవిభునిసన్నిధిని.
తదనంతరంబ యింద్రప్రస్థపురము
ముదమున నిరువదిమూఁడేండ్లునిండఁ
జెలఁగి రాజ్యమ్మునుజేసి, జూదమున
నెలమితో నోడి, యయ్యెడ పాండుసుతులు