పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/682

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

616

ద్విపద భారతము.


శకుని ధర్మజునితోఁ -------------
"సకలసామ్రాజ్యంబు సమధికార్థములు
ధృతరాష్ట్రభూపతి ధృతి మీకునొసగె
నతులితభంగితో నవియొడ్డవలదు ;
క్రొత్త యీపదము దిక్కులయందువినఁగ;
సత్తుగా జూదంబు సరవినాడంగ
నోడినవారలు నున్నతశక్తిఁ-
గూడి నిత్యమును సంకుచితమార్గమున
ద్వాదశాబ్దములు కాంతారమధ్యమున
మోదంబుతోఁ గందమూలఫలములు
భక్షింపుచును మహాబ్రహ్మచర్యమున
దక్షతవర్తించి, తఱితోడ నొక్క
వర్షంబు నజ్ఞాతవాసంబుచేసి,
హర్షజ్ఞులగులోకులటయెఱిఁగినను
వనమునఁ బండ్రెండువత్సరంబులును
మునుజరింపుచుఁ బదుమూఁడవయేఁట
నజ్ఞాత వాసంబు నటుసల్పువారు;
తద్‌జ్ఞతనొడ్డి జూదంబునీవాఁడ
నోపితివేనియు యుక్తితోనాడు
దీపించి." యనిన విధిప్రేరణమున
ధర్మనందనుఁడు జూదంబాడి యోడె
ధార్మికులును సభాస్థలివారు నెఱుఁగ.
పటుశుభాశుభకర్మఫలము లెవ్వరికి
నటనుభవింపక యరుగంగరాదు;
కావునఁ బాండవాగ్రజుఁడు జూదంబు
దైవికంబుగనోడి తమ్ములుఁ దాను
నడవి కేఁగఁదలంచి యఖిలరాజ్యమును
విడిచి సుహృద్బంధువిప్రులతోడఁ