పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/676

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

610

ద్విపద భారతము.


వ్యాకులతలు పుట్టె వరుస నందంద;
లోకనిందితు లతిలోభవర్తనుల
ధార్తరాష్ట్రుల గృహాంతరముల మొఱసె
ధూర్తశృగాలసందోహఘూకములు
మదధార లుడిగె సామజయూధములకుఁ;
గొదలేక ఘోటకాక్షుల నీరువెడలెఁ;
జుక్కలు నిల రాలె క్షోణి కంపించె;
మిక్కిలిరుధిరంబు మేదినిఁ గురిసె.
అట్టిమహోత్పాత మడరి పుట్టుటయు,
గట్టిగా విదురుండుఁ గలశజకృపులుఁ
దమలో విచారంబు దగఁజేసిరంత
సమచిత్తులై యొక్కసంస్థానమందు:
'నడుగక ధృతరాష్ట్రునకు నరిష్టంబు
పొడము నిశ్చయముగా భూము లెఱుంగఁ;
బాండవేయులతోడఁ బగపెట్టుకొనిరి
భండనంబునఁ జావఁబడుదురుగాక.'
అనవుడు గాంధారి యామాటలెల్ల
విని విదురునిఁ గొంచు వేగంబె పోయి
ధృతరాష్ట్రుముందట ధృతిఁబెట్టుటయును
నతిభక్తితో నాతఁ డన్నకు మ్రొక్కి:
"దుర్యోధనుఁడు చేయు దుష్కార్యములకు
నార్యసమ్మత, నీవు ననుకూలమైతి;
వేనెంత చెప్పిన నిచ్చలోఁ గొనక
మానవాధిప, మోహమగ్నుండవైతి;
కార్యంబుదప్పె నేగతి మీఁద నింకఁ!
గార్యంబు లెచ్చెను గౌంతేయులకును.
హరిసూనుచేఁ బవనాత్మజుచేత
దురములోఁ బడుదురు దుర్యోధనాది