పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/675

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సభాపర్వము ; ద్వితీయాశ్వాసము

609


పరమపతివ్రతఁ బాంచాలి నెట్లు
సరవి యెఱుంగక సభికులుదిట్టఁ
'దొడలమీఁదికిరమ్ము తొయ్యలి ! ' యనుచుఁ
గడుపాతకములై నకష్ట భాషణలు
పలికియుండితి; గానఁ బరమార్థముగను
గలనను నీయూరు కాండద్వయంబు
బలిమి నాగదచేత భగ్నంబుచేతుఁ;
దెలియంగ నిది నాప్రతిజ్ఞ లోకమున ;
నిక్షత్త్ర మొనరింతు నిన్ను నీవారిఁ
దత్ క్షణంబున. " నని దర్పితప్రౌడి
విలయకాలమునాఁటి వికలకృతాంతు
వడుపున రుద్రుఁడై పటుగదా ఖడ్గ
కాండాసనములున్నకడ చూచుటయును,
దండపాణి చలించె; ధాత భీతిల్లె ;
జగములు భయమందె; జలధులు కలఁగె;
నగములు వణఁకె ; పన్నగములు ముణిఁగె.
అపుడుశంకింపుచు నాసభ వారు
నిపుణోక్తులందు వర్ణించిరిభీము ;
తమయన్నయైనట్టి ధర్మజువదన
కమలంబుఁజూచి యాఘనునాజ్ఞ వేచి
యుండుచో భీముఁగుంభోద్భవ విదురు
లొండొండ భయభక్తియుక్తి నిట్లనిరి:
“శౌర్యంబుచూపెడి సమయంబుగాదు
కార్యంబుగావించు గతి యిదిగాని. '
యనుచు శాంతునిఁజేసి యట్లున్న యెడను,
దినకర తేజుని ధృతరాష్ట్రవిభుని
యనలహోత్రములాఱె నద్భుతంబుగను ;
గనుఁగొనఁ గౌరవాంగనలచిత్తముల