పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/674

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

608

ద్విపద భారతము.


ద్రౌపదిఁజూచి శా తనవుఁడిట్లనియె :
"ఓపుణ్యసాధ్వి, నీలోత్పలనేత్ర,
నీవుపల్కిన ధర్మనిజవాక్యములను
దైవజ్ఞుఁడ ధర్మతనయుఁడె యెఱుఁగు ;
నితరులెఱుంగలే రెన్ని భంగులను,
అతిపాపచిత్తులై యవమానమిపుడు
వదలక నినుజేయు వారలందఱును
గొదలేక మీఁదఁ ద్రుంగుదురు గ్రక్కు నను. "
అనుచున్న సమయంబునందు నాసుదతిఁ
గనుఁగొని రోషించి కర్ణుఁడిట్లనియె:
"ఏవురుపతులు నిన్నీ జూదమునను
వావిరి విడిచిరి; వరుసనొక్కరునిఁ
గైకొను” మనుటయుఁ గౌర వేశ్వరుఁ
నాకంజనేత్రతో నప్పుడిట్లనియె :
“అంకంబునకు హరిణాంకబింబాస్య,
శంకింప కే తెమ్ము సంభ్రమంబునను. "
అనుటయు భీముండు నధికసాహసుఁడు
ఘనుఁడు కౌరవకురంగ మృగేశ్వరుండు
ప్రళయకాలమునాటి ఫాలాక్షుఁడగుచుఁ
బలికెను సభవారు భయమందిచూడ :

భీమప్రతిజ్ఞ

“ అధిక రాజ్యమదంబునందును గ్రొవ్వి
యధముండవోరోరి ! యతిదుష్టచరిత,
'వావివర్తన' లేనివాఁడవు సర్వ
కోవిదనిందితక్రోధచిత్తుఁడవు
దుర్మదుండవు జగద్ద్రోహివి పాప-
కర్ముండవగు నిన్ను ఖండింతుమీఁద.