పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/670

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

604

ద్విపద భారతము.


బలికె మారుతి ప్రతాపముననుప్పొంగి:
"కలబాంధవులు కురుక్ష్మాపతి చూడ
సమరరంగమున దుశ్శాసనుఁబట్టి
క్రమముతో వానివక్షస్‌స్థలిచించి
రాజిత రుధిరధారలు క్రోలిక్రోలి
తేజంబుతో వానిదేహాంతరంబు
ప్రేవులుఁజీరెద భీమంబుగాను
దేవకోటులు ప్రస్తుతింప రౌద్రమున ;
చెనసి వానిని నిట్లుసేయకుండినను,
దనరంగఁ బితృప్రపితామహులకును
దప్పినయాదురితము నొందువాఁడ ;
నిప్పుడు తత్వార్థ మేనాడుమాట
సందేహమునులేదు జగతీతలమునఁ
బొందుగా.” నని మహాద్భుతశౌర్యమునను
మిగులుటయును జూచి మించి యాసభను
మగఁటిమిగల కురుమండలేశ్వరుఁడు !
నమితభయభ్రాంతుఁడైయుండె ; నంత
రమణతో నాధృతరాష్ట్రునిందించి
పెరిమఁ బాంచాలి నుపేక్షించుచున్న
వరయోధులనుజూచి వైళంబునందు
నెల్లవారునెఱుంగ నెసగుహస్తములు
మొల్లముగావించి మును విదురుండు
పెద్దయెలుంగునఁ బెరసి యిట్లనియె:

విదురుని ధర్మప్రసంగము

"పెద్దలకెల్లను బృథివిలోపలను
ధర్మంబు సత్తుగాఁ దగఁ జెప్పకున్నఁ,
బేర్మి భావంబులు పెక్కులుపుట్టు ;