పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/664

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

598

ద్విపద భారతము.


అంచితశుకవాణి నలినీల వేణిఁ
బాంచాలి నోడంగఁబాఁడియే నీకు !
శకునికైతవ మాత్మఁ జాలంగనెఱిఁగి
ప్రకటితంబైన మాయాద్యూతమాడి
వేగ నధర్మప్రవృత్తుండవైతి
వాగ మోక్తులెఱింగి యధిప, నీబాహు
నాహంబుసేయంగఁదగు నీక్షణంబ
యూహించి." యనవుడు నొనర భీమునకు
నర్జనుండనియెఁ బ్రియాలాపములను :
"నిర్జరారాతి సునీతిమానసుఁడు
ధర్మతనూజుండు ధర్మవర్తనుఁడు
ధర్మంబుదప్పిన, ధరణీతలంబు
తల్లడిల్లును ; రసాతలముకంపించుఁ ;
బెల్లగిల్లును మహాపృథివీధరములు ;
కమఠంబుముణుఁగు; దిగ్గజములుమ్రొగ్గుఁ ;
గమలాప్తచంద్రులగతులు గీడ్వడును.
తగిలి సుహృద్ద్యూతధర్మయుద్ధమునఁ
బగతునిచే నోటువడియెఁ గావునను,
గురుల ధర్మాత్ములఁ గోపింపఁదగునె !
ధరణి శూరులకును దర్కించిచూడ ;
దైవికమునను జూదంబాడి యోడెఁ
బ్రావీణ్యమతియైన పాండవాగ్రజుఁడు."
అనిన శోకాక్రాంతులగు పాండవులను,
వనితద్రౌపదిఁ జూచి వగచి మిక్కిలిని

వికర్ణు నార్యవచనములు

అనియె భక్తి వికర్ణుఁడార్యులతోడ :
"ఘనజగద్ద్రోహి దుష్కర్మతత్పరుఁడు