పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/659

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సభాపర్వము ; ద్వితీయాశ్వాసము

593


విననపూర్వంబయ్యె విశ్వధారుణినిఁ ;
జెనసి ధర్మజుఁడిట్లు చేయువాఁడొక్కొ !
మును తనునోడి దుర్మదవృత్తితోడ (?)
ననునోటువడుట యెన్నఁగ నిదినిజమొ!
కల్లయో!" యనుచును గడుసంశయమున
నెల్లగానికి మఱియిట్లనపలికె: (?)
"ధర్మనందనుని మోదంబుతో నడిగి
పేర్మిఁ దత్సభకును బెంపుదీపింపఁ
దోకొని పొ." మ్మన్న ధృతి వాఁడునరిగి
ప్రాకటంబైన ద్రౌపదిపల్కులెల్ల
ధర్మనందనుని కెంతయు నెఱిఁగింప,
ధర్మదేవతను జిత్తమునందు నిలిపి
యధికచింతాక్రాంతుఁడై యుండుటయును,
అధముండు దుర్మార్గుఁడగు సుయోధనుఁడు
ప్రాతికామికి నతిత్వరత నిట్లనియె :
"నీతఱి సభ వారలిందఱు నెఱుఁగ
ద్రౌపదిఁదోడ్కొని తడయకరమ్ము
నైపుణ్యమున." నన్న నలి వాఁడునరిగి
పాంచాలితోడఁ దప్పక యిట్టులనియెఁ :
"జంచలలోచన, శమననందనుని
నడిగితి; సభవారు నటవిచారించి
వడి నిన్నుఁదోడ్కొని వరుస రమ్మనుచు
నన్నుఁబుత్తెంచిరి నలినాక్షి !" యనిన
నున్నయాద్రౌపదియును దలపోసి
దుర్మార్గుఁడైనట్టి దుర్యోధనుండు
ధర్మంబుదప్పినతలఁపునక పుడు
ధర్మనందను సమ్మతమునకు వెఱచి,
ధర్మస్వరూప యాద్రౌపది కడఁగి