పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/651

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సభాపర్వము ; ద్వితీయాశ్వాసము

585


నీతిదూరుని లోకనిందితుఁ డుజను
జాతరోషుని దురాచారుఁ గ్రూరాత్ము
దుర్యోధనుని దుర్మదుని నివారించి
యార్యసమ్మతమున నన్వయంబెల్ల
రక్షించు; దగఁబాండురాజనందనుల
లక్షణజ్ఞుల సముల్లాసచిత్తులను
ధీరుల మన్నించి ధృతరాష్ట్ర, నీవు
ధారుణిఁబాలించు ధర్మమార్గమున.
వినుము శృంగారంబు పెనఁగొనియున్న
ఘనసముత్తుంగ ప్రగల్భద్రుమముల
సంగారమునకై రయంబునఁ గాల్చు
వెంగలికైవడి వీఁగకింతయును
సమకట్టె లోభి వశంబునఁ జాల
కుమతి నీతనయుండు కరుకులేశ్వరుఁడు
పాండునందనులను బరఁగఁగల్మషము
నొండొండ..... ......... ....... ........ ........
అసమసాహసులతో నాజిసేయంగ
మసలుచునున్నాఁడు మదమునఁగదిసి.
తరమెఱుంగక ప్రల్లదంబున వీఁడు
మొఱయుచునున్నాఁడు మొక్కలంబునను.
కురుకులక్షయకారి గుణవిహీనుండు
దురి తాత్ముఁ డీతనిఁ దొలుతవారించి
సృష్ఠీశ, యిఁకనుపేక్షింపక నీవు
దృష్టంబుగా మాన్పు తెలివి జూదంబు
బుద్ధిగా, " దనవుడుఁ బుత్త్రమోహమున
సిద్ధంబుగా నొండుసేయంగలేక
యూరక ధృతరాష్ట్రుఁడుండెఁ జిత్తమున ;
నారయ విదురుండు నాసుయోధనుని-