పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/650

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

584

ద్విపద భారతము.


నొక్కొక్కయొడ్డున నోడినఁ, జూచి
తక్కక విదురుండు ధర్మసూనునకు
వగచి యాధృతరాష్ట్రవసుధేశుకనియె:
"జగతియందును గురుక్ష్మాతలేశ్వరుఁడు
దోషంబులకుఁబుట్ట దుర్నిమిత్తములు
ఘోషతోఁబుట్టెను గోచరంబుగను.
దశదిశలను సుకృతమునొందినట్టి
శశివంశజుండైన శంతనుచక్ర-
వర్తికులంబున వసుమతియందుఁ
గీర్తిపొందని కురుక్షితిపతిపుట్ట
సకలపాపంబులు సంభవంబొందెఁ ;
బ్రకటితముగ మీఁద ప్రళయంబుతోచుఁ ;
గులమునకును నెగ్గు గొనకొనిపుట్టు
నిలలోన నిప్పుడే యీతనికతన.
కులనాశకుఁడగు దుర్గుణుని దుర్మదుని
వలదనివారించి వంశరక్షణము
చేయఁగానగు నంచుఁ జెప్పెశుక్రుండు.
పాయక యటుగాన, పాలించుకులము ,
యదు వృష్ణివీరులు హరి నియోగించి
ముదమునఁ దమకులంబునకును మిగుల
దూషకుండగు కంసుఁ దునిమించి శౌర్య
భూషణులైరి భూభువనమెఱుంగ.
వాసవసుతు ధర్మవర్తనుఁ బనిచి
రాశి జూదము నివారణముగావింపు;
జనవిగ్రహము మాన్చి సత్ప్రధానులకు
ననుకూలమొనరించు మద్భుతంబుగను;
మనుజాధముని దుష్టమానసు శకుని ,
ఘనబహిష్కృతుఁ బాపకలితు దుర్మార్గు