పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/631

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సభాపర్వము ; ద్వితీయాశ్వాసము

565


అతిమనోహరమైన యాసభయందు
నతులితభద్రసింహాసనాసీనుఁ
డంతకతనయుఁ డత్యంతసంపన్నుఁ
డెంతపుణ్యంబు దానిలఁజేసెనొక్కొ !
సకలభూపతులు నసంఖ్యంబులైన
ప్రకటితార్థములు దప్పకతెచ్చిపెట్టి
కొలుచుచునుండిరి కొంకకకదిసి;
బలవంతులై ప్రతాపమునశోభిల్లి
భూసురోత్తములకు భూరిదానములు
చేసి దిగ్విజయలక్ష్మీసమగ్రమున
నున్నారు రాజులై యుర్వియేలుచును
సన్నాహమునఁ బాండుజగదీశసుతులు.
వారికెవ్వరుసాటి వసుధీశకోటి ;
వారికి వరదుఁడై వాసుదేవుండు
హితమాచరింపుచు నెల్ల కాలంబుఁ
జతురత్వముననుండు ; శౌర్యంబునందుఁ
జేదిభూపతి శిరశ్ఛేదంబుఁజేసె
మేదినీనాథులుమిక్కిలిబెగడ;
యాదవోత్తముఁ గృష్ణు నందఱుఁజూచి
భేదింపఁగాలేక పెంపుతోడుతను
బొగడుచునుండిరి భుజశక్తిదఱిగి;
తెగువతోఁ బాండుధాత్రీనాథసుతుల
సంపదలెల్ల నీక్షణములోపలను
సొంపుతోఁగొనుబుద్ధి చొనుపంగవలయు."
ననుకురురాజు భవ్యాలాపములను
మనమునఁ దలపోసి మామయిట్లనియె:
"మీతండ్రి ధృతరాష్ట్ర మేదినీశ్వరుని
నీతివిచారించి నెఱయఁ గావింపు."