పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/629

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సభాపర్వము ; ద్వితీయాశ్వాసము

563


నీలరశ్మిచ్ఛటానిచయంబుపర్వ,
నాలోనసని జలంబని సంశయించి
రమణీయ దివ్యాంబరములన్నియును
గ్రమమున నెగఁద్రోచు కడురభసమునఁ
జొచ్చిన, నది నీలశోభితమణుల
నచ్చుగాఁ జూపట్టునాస్థలంబయ్యె.
అటుమీఁద నేఁగంగ నంబుజాకరము
పటుతరంబుగఁజూచి బహునీలరుచుల
మణితలంబనుచుఁ గ్రమ్మనఁ జొచ్చుటయును,
బ్రణుతికినెక్కిన భవ్యాంబరములు
తడిసినఁ గ్రమ్మఱ తడయ కే తేర
నడరి పాండుకుమారులయ్యెడ నగిన,
ధర్మంబుదలపోసి ధర్మనందనుఁడు
కూర్మిరెట్టింప నాకురుమహీపతికి
దివ్యవస్త్రములును దివ్యగంధములు
దివ్యభూషణములుఁదెఱఁగొప్పఁ బనిచె
ననిలసూనునిచేత నానందమునను;
బనిచినఁ గురుమహీపతియును గట్టి
చాలంగ ధర్మజుసభఁజూచి లజ్జ
నోలి పాండవులను నొగివీడుకొనుచు
నిజపురంబునకును నేర్పునవచ్చి,
భజన లేకతలంచి బహుభంగి వగచి
రాజచంద్రుఁడు ధర్మరాజశేఖరుని
రాజసూయమహాధ్వరంబు మానవుల
నయనోత్పలముల కానందమై యొప్ప
నియమింపఁగాఁ దన నేత్రంబులకును
బావకనిచయమై పరఁగుచునుండె.
భావింపఁగాఁ దగు పసిఁడిగాచినను