పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/626

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

560

ద్విపద భారతము.


చేదిభూవిభు శిరశ్ఛేదంబు చేసె ;
నాదట వానిమహాకళేబరము
కులిశంబుచేఁ బడ్డకొండచందమున
నిలమీఁదబడె రక్తమెంతయుఁదొరగ
జగతీతలేశులు సంచలంబందఁ
దగ శిశుపాలునితనువుననున్న
తేజంబువెలువడి దిశలెల్లవెలుఁగ
రాజకోటలుచూడ రాజార్కనయను
దేహంబుసొచ్చె సందేహంబులేక .
యూహింప నయ్యెడ నుర్వీశులనిరి :
"జయపుండరీ కాక్ష , జయచక్రపాణి,
జయరమాధీశ్వర, జయహృషీకేశ,
ఖగరాజగమన, రాక్షసరాజదమన,
నగరాజహస్త, పన్నగరాజశయన,
రక్షించుసర్వేశ, రాజీవనాభ,
యీక్షించుమముఁ గృప నిభ రాజవరద!”
అనుచు సన్నుతిచేసి యందఱు మ్రొక్కి
మనమున సంతోషమగ్నులై యంత
ననురక్తి రాజసూయాధ్వరంబొప్ప
ఘనత సంపూర్ణంబుగా నొనరించి
యాధర్మనందను నధికపుణ్యాత్ము
యోధాగ్రవర్యు నత్యుత్తమోత్తమునిఁ
గని మోదమునుబొంది కమలాక్షుఁడాది
యనిమిషావళి గొనియాడిరి మఱియుఁ
గురువీరులెల్లఁ బేర్కొనిరివేర్వేఱ.
వరుసతో నంత నైశ్వర్యుఁడై యున్న
ధర్మజుకడకు భూధవులేఁగుదెంచి
యర్మిలి సద్భక్తి నప్పుడిట్లనిరి: