పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/625

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సభాపర్వము ; ద్వితీయాశ్వాసము

559


నాకదియేటికి నయమార్గదూర !
నాకునిచ్చినయట్టి నలివలోచనను
నీవువరించితి నిఖిలంబు నెఱుఁగఁ ;
గావున మఱి సిగ్గుగలదె నీకెందు?"
ననుచు దుర్భాషల నాడుచునుండ
విని కృష్ణుఁడప్పుడు వేగఁ గోపించి
తలఁచినంతటిలోనఁ దద్దయు వచ్చెఁ
గలితనిర్వక్ర విక్రమము చక్రమును.

శిశుపాలవధ

అది శతకోటిబాలార్కప్రకాశ
విదితమై శతకోటివిస్ఫూర్తియగుచు
వచ్చినఁ, జక్రంబు వాసుదేవుండు
చెచ్చెఱ నుగ్రుఁడై చేతసంధింపఁ
గులగిరులూటాడెఁ; గూర్మమల్లాడె;
జలధులుగలఁగె; నాశాచక్రమగలె ;
రవితప్పఁదిరిగెఁ; దారకములు డుల్లె ;
దివికంపమందెను; దేవేంద్రుఁడడలె;
నుడుగక యొకమ్రోఁత యూఱక మ్రోసె;
నడరి రసాతలంబద్భుతంబందె;
బ్రహ్మాండములు భయభ్రాంతివహించె;
బ్రహ్మాది సన్మునిప్రణుతాంఘ్రుఁడైన
హరి యట్టివేళ మహారౌద్రమునను
బిరబిరమని త్రిప్పి బిట్టువ్రేయుటయు,
గురుతర నిర్ఘాత ఘోషంబుతోడఁ
బరిపూర్ణ విలయోగ్ర పాపకశిఖలు
భూమండలమున నభోమండలమున
భీమమై పర్వంగ బెట్టునవచ్చి