పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/623

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సభాపర్వము ; ద్వితీయాశ్వాసము

557


బలభద్రుకిచ్చినఁ, బరఁగంగ నతఁడు
జలజాక్షుచేతికిఁ జియ్యన నిడిన,
శిశుపాలు మిక్కిలిచేతులుఁగన్ను
దిశయెఱుంగక పోయెఁ దెల్లమిగాను.
దానిఁదలంచి సాత్వతి యశరీర
మానితవాక్యంబు మదిలోన నెఱిఁగి,
హరిచేత శిశుపాలుఁ డణఁగు గ్రక్కునను
బరమార్థమని కైటభద్వేషికనియె:
"మకరాంకజనక, నీమఱఁదిని వీనిఁ
బ్రకటితబలు శిశుపాలునివలన
నూఱుతప్పులుగాపు నూతనంబుగను;
మాఱుమాటాడక మన్నించు నన్ను . ,
అని వానిజనని పద్మాక్షుఁ బ్రార్థింప,
వనజనేత్రుండును వరమిచ్చెఁ ; గాన
నపరాధములునూఱు నటు నిండుదనుక
నుపమ యూరకయుండుటుచితంబు మనకు.
కనకాంబరునిచేతఁగాని యీదుష్టు
మనచేత నాజిలో మరణంబుగాఁడు.
ఇతరమానవులు నన్నెగ్గులాడినను
హతముసేయుదు మదీయాస్త్రములందు."
అనెడుభీష్మునిమాట లాలించి, భీము
మునుపుగైకొనక, యమ్మురవైరికనియె:
"అవమాన్యుఁడగు నిన్ను నాస్థానమునను
అవిరళమతి మాన్యుఁడని పాండుసుతులు
గాంగేయుఁడును నిఫ్డు గడఁగిపూజించి ;
రాంగిక మెఱుఁగక యధికదుర్బుద్ధి,
నీవునుగైకొంటి నెఱయఁగాఁ బూజ;
యీవసుమతి నీకు నిటు చెల్లునోటు !