పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/620

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

554

ద్విపద భారతము.


తలపోయ మును సముద్రంబుతీరమున
విలసితంబుగ నొక్క వృద్ధహంసంబు
క్రమముదప్పక ధర్మకథలుచెప్పుచును,
గ్రమముదప్పక యట్టి ఖగములనెల్ల
శిక్షింపుచును ధర్మశీలుఁడై ప్రాణి
రక్షకుండై విహారముసేయుచుండు ;
విహగంబులును దాన విశ్వాసమంది
సహజపాథోరాశి జలచరంబులగు
పక్షుల మాధుర్యభక్ష్య భోజ్యముల
దక్షతఁదెచ్చి నిత్యముఁ బెట్టుచుండి
తమయండషండముల్ దత్సమీపమున
నమర నిక్షేపించి యతిదూరమరుగ,
నాసమయంబున నాహంసరాజు
గ్రాసంబుగా సర్వఖగకులాండములు
భక్షించియుండినఁ, బఱ తెంచి యొక్క
పక్షి వీక్షించి తప్పక పక్షి తతికి
వృత్తాంతమంతయు వేగఁ జెప్పినను,
జిత్తంబులందును జింతించి వగచి
యాముదిహంసను నడగించి నపుడు.
భీమవిక్రమమునఁ బేర్చి మిక్కిలిని
ధర్మచిత్తుండవై ధర్మసత్కథలు
కూర్మిఁ బాండవులకుఁ గురుకుమారులకుఁ
దెలుపుచుఁ గలహంస ధృతి నొనర్చెదవు.
బలియురఁ బెక్కండ్రఁ బద్మలోచనుఁడు
దండించె నని సంస్తుతంబొనర్చెదవు ;
వుండరీకాక్షుని భూరిబలంబు
నేనెఱుంగనిదియే నిఖిలంబునందు !
మానుషంబునఁ బొంగు మాగధునకును