పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/614

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

548

ద్విపద భారతము.


హారంబుతరుచరు, కఖిలగంధములు
గౌరవోన్నతి నాసికాహీనునకును,
వేదురునకుఁజీర, విరసచిత్తునకు
వేదంబు, లోభికి వితరణగుణముఁ
జేయుట విష్ణుఁబూజించుట ; మఱియు
నీయననీశ్వరు లిందఱుం [1]డంగ
నర్చింతురే కృష్ణు? " నని యెగ్గులాడి.
పేర్చినయలుకతోఁ బెరమెనేఁగుటయు,
నతనిపిఱుందనే యమసుతుండరిగి
యతులితప్రియభాష సప్పుడిట్లనియె:

ధర్మజాదులు శిశుపాలు ననునయించుట

“ధీమంతులకుఁ గృపాదృష్టియుక్తులకుఁ
గోమలయశులకు గుణవిశాలురకుఁ
జారునిర్మల ధర్మచరితులై నట్టి
భూరితేజులకు నెప్పుడుఁ గోపమేల ?
క్రూరంబు శిఖికంటెఁ గులిశంబుకంటె
దారుణంబైయుండు ధారుణిలోన
ఆదినారాయణుండైనట్టివాఁడు
వేదాంతవేద్యుఁడై వెలసినవాఁడు
ప్రల్లదులను ద్రుంపఁ బాల్పడ్డవాఁడు
........ ........ ........ ........ ........ .....
శరణాగతులఁబ్రోవఁ జాలెడువాఁడు
పరమాత్ముఁడై లక్ష్మిప్రబలినవాఁడు
నాతఁడర్హుండని యాభీష్ముఁడెఱిఁగి
సతతంబుఁ బూజింప సరవితోఁ బనుప,

  1. ననంగ. (మూ)