పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/606

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

540

ద్విపద భారతము.


రాజులలోనెల్ల రాజసంబునను
రాజితధర్మ నిర్మలయశోనిధిని;
సకలసామ్రాజ్య ప్రశస్తలక్ష్ముణుడు
నకలంకగతిఁ గర్త ననిశంబునీవు ;
ఇదితగుఁ దగదన కేపనికైన
ముదమునఁ బనిపంపు మునుపుచేసెదను;"
అనిన సంతోషించె నపుడు ధర్మజుఁడు.

రాజసూయాధ్వర ప్రారంభము^

వనజాక్ష ధౌమ్య సద్వ్యాసానుమతిని
ఘనరాజసూయయాగము సేయఁ బూని
యనుజన్ము సహ దేవు నప్పుడుచూచి
పలికె ధర్మజుఁడు : భూపతుల నందఱను
బిలువంగఁబంపుము పెద్దఱికమున ;
రప్పింపు భూ దేవరాజులనెల్ల ;
నొప్పుగా వారికి నుచితగేహములు
కట్టింపు; యాగోపకరణంబు లెల్ల
గట్టిగాఁ దెప్పింపు గడఁకనీ. " వనిన
నగుఁగాక యనుచు సహదేవుఁడపుడు
నిగమోక్తిగాఁగ నన్నియు సమకూర్చి,
యుర్వి దేవతల రాజులను రప్పించి,
సర్వసౌఖ్యములను సంతోషములను
నుండుచో ; ధర్మజుండొగి నకులునకు
నిండినభక్తితో నెఱయనిట్లనియె:
"గాంగేయుఁడాదిగాఁగలబాంధవులను
సంగతిఁదో తెమ్ము చయ్యన." ననిన
నతఁడును గరిపురికరిగి భీష్మునకు
ధృతరాష్ట్రునకును యుధిష్ఠిరుమఖము