సభాపర్వము ; ప్రథమాశ్వాసము
529
అంతట ధర్మజుఁ డనిలజుకనియె:
'నెంతయుఁఁడఁగ మీరెల్ల సైన్యములు
సేవింపఁ బూర్వదక్షిణపశ్చిమముల
కా [1]యుత్తరంబున కరిగి రాజులను
గెలిచి కప్పంబులఁ గీర్తితో గొనుచు
బలిమినేతెం'డని పనుప నాక్షణమె
నాల్గువారధులపై నడచెడి క్రొత్త
నాల్గువారిధులట్లు నలుగురు గదలి
చనిరి వా." రనవుడు జనమేజయుండు
జననుతుఁడైన వైశంపాయనునకు :
"నే దేశమునకు వారేగిరి? ధనము
లేదేసఁ దెచ్చిరి? యెఱిఁగింపు.” మనినఁ
జతురాత్ముఁడైన వైశంపాయనుండు
మతి జనమేజయక్ష్మానాథుకనియె:
విజయు నుత్తరదిగ్విజయము
"వర్ణనకెక్కు పావకదత్తమైన
స్వర్ణదివ్యరథంబు జయముతో నెక్కి,
...............................
...............................
మత్తశాత్రవరాజమణుల మర్డించి,
యుత్తరభూమికి నురువడి నేఁగి
రణరంగమున నుమారమణునిఁ బ్రమథ
గణముల గెలిచి, భీకరశౌర్యమునను
ధనదునోడించి యర్థముచాలఁగొనుచు,
ననిమిషేశ్వరునిచే హాటకంబంది,
- ↑ వుత్తరంబున (మూ) వ్యావహారికోచ్చారణననుసరించి కవియీపదమును వకారాదిగాఁ బ్రయోగించియుండును.