పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/570

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

504

ద్విపద భారతము.


స్వర్గస్థులగుదురు సత్తుగా; నిట్టి
మార్గంబునను జసమర్దనంబగును,
ఏమి సేయుదు!" నని యిచ్చఁజింతింప
నా మెయి ధౌమ్యాదులప్పుడిట్లనిరి :
"రాజితంబుగఁ జేయు రాజసూయంబు;
నాజన్మముగఁ జేయు నఘములు దొలఁగు;
లోనుమీకగు రాజలోకమంతయును;
మానుషంబున రాజమణులను గెలిచి
కావింపవే వేగ క్రతు." వనుటయును,
నావేళ ధర్మజుం డాత్మఁజింతించి
యిందుకు నిర్విఘ్న మెంతయుఁగాను
గందర్పజనకుండు కరివరదుండు
పుండరీకాక్షుండు పురుషోత్తముండు
అండజపతివాహుఁ డట కర్తయనుచు
జారునిఁ బిలిపించి సద్భక్తి బలికెఁ :
"దేరు గొంచును పోయి తేజంబుతోడ
శ్రీకృష్ణుఁ దోతెమ్ము శీఘ్రమ్మునందుఁ
బ్రాకటమ్ముగ." నంచుఁ బనిచిన వాఁడు
ననిలవేగములైన హయములుపూను
ఘనరథంబెక్కి, యాకమలాక్షుకడకుఁ

కృష్ణుఁ డింద్రప్రస్థమునకు వచ్చుట

బోయిన, నెఱిఁగి యాపుండరీకాక్షుఁ
డాయెడ రథము నెయ్యంబున నెక్కి
తత్ క్షణంబునను నింద్ర ప్రస్థపురికి
రక్షణంబునవచ్చి, రమణికుంతికిని
ధర్తజునకు మ్రొక్కి, తరువాత భీము
నర్మిలి గౌగిట నందంద చేర్చి,