పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/558

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

492

ద్విపద భారతము


దిక్కులయందు సత్కీర్తి నిల్పుచును,
మక్కువ బంధుసమాజంబునెల్ల
గారవింపుచు, సత్యగౌరవంబులను
బేరంది, భూతిచేఁ బృథివియేలుచును
ఆదిరాజచరిత్రుఁడై యుండునంత,
నాదరచిత్తులై యైశ్వర్యమహిమ
పక్షంబుతోఁ బూర్వపశ్చిమశైల
దక్షిణోత్తర ధరాధరమధ్య విశ్వ
ధారుణీంద్రులు, భద్రదంతావళములుఁ
జారు ఘోటకములు సౌవర్ణములును
నవరత్నములును నానావస్త్రములును
యువతుల మృగమదవ్యూహగంధములు
నాందోళికలును ముక్తాతపత్త్రములు
సందీపితధ్వజ సముదయంబులును
దివ్యభూషణములు దివ్యాయుధములు
దివ్యరథంబులుఁ దెఱఁగొప్పఁదెచ్చి
యిచ్చి సాష్టాంగంబులెఱఁగి సేవింతు
రిచ్చలో సొంపున నెల్ల కాలంబు
ధర్మజు నమితప్రతాపసంపన్ను
నిర్మలచరితుని నీతిమానసుని.
ఆధర్మసుతుఁడును నఖిలరాజులను
ఆదరింపుచునుండు నవసరంబునను,
కలశజ కపిల మార్కండేయ కుత్స
జలజాతభవసమ శాండిల్య వత్స
శౌనక శుక పరాశర కణ్వ గాధి
సూను గౌతమ గార్గ్య సోమ మాండవ్య
మునిశేఖరులు వచ్చి మును ధర్మసుతుని
ఘనసభాస్థలి వివేకమున భూషింప,