పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/557

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సభాపర్వము ; ప్రథమాశ్వాసము

491


బదునాల్గునెలలు నిర్భరవృత్తితోడ
ముదముననిర్మించి, ముఖ్యదానవుల
నెనిమిదివేల నహీనసత్వులను
మునుమిడిపన్నించి మోయించుకొనుచుఁ
దెచ్చి ధర్మజునకుఁ దేజంబుతోడ
నిచ్చి, భీమునకును నెన్నికయైన
గదయుఁ బార్థునకు శంఖంబును నొసగి,
సదమలయశుఁడైన శమనజుచేత
నర్మిలి సత్కృతుండై మయుండరిగె.
ధర్మతనూజుండు ధర్మమార్గమున
ధర్మజ్ఞు లౌనన ధరణీసురులకు
నిర్మలమతులకు నీతిమంతులకుఁ
బదివేవురకు భక్తిఁ బాయసాన్నంబు
విదితవేదోక్తులు వెలయఁ బెట్టించి,
మణిముద్రికల వస్త్రమాల్యగంధముల
గణనకెక్కఁగ నలంకారులఁజేసి, (?)
వేయేసిగోవుల వేదవిప్రులకుఁ
బాయక భక్తితోఁ బ్రఖ్యాతినిచ్చి,
లాలితంబగు శుభలగ్నంబునందుఁ
ద్రైలోక్యగురుఁడైన ధౌమ్యభూసురుని
పుణ్యాహవాచనపూర్వకంబుగను
గణ్యమనస్కుఁడై ఘనతఁ దత్సభను
ఉనికియై యుండె నత్యున్నతశ్రీల.
మనుజేశ్వరుఁడు నంత మహితసత్కృపను
భూదేవతాకోటిఁ బూజించి, సర్వ
వేదశాస్త్రంబులు వినుచు, సంసిద్ధి
నమితదానంబులు నాచరింపుచును,
గ్రమముతో నర్థిసంఘములఁ బ్రోచుచును,