పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/547

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; అష్టమాశ్వాసము

481


అల నరనారాయణాఖ్యులు మీరు
కలితతేజోధర్మఘనపరాక్రములు.
భూభార మిరువురుఁ బూని మాన్పుటకు
భూభువనంబునఁ బుట్టితిరిట్లు.
ఖాండవదహనంబు గావించినట్లు
కాండాగ్నిఁగూల్పుఁడు ఘనశత్రువితతి.
కృష్ణసఖుండైన కృష్ణాప్రియునకుఁ
గృష్ణాభిధానంబు గీల్కొనుఁగాక. ”
యని కృష్ణనామంబు హరిసూతి కొసగి
ఘనముగా బహుదివ్యకాండజాలంబు
సురలచేనెల్లను శుభమంత్రశక్తి
నిరువుర కిప్పించి, యిష్టంబుమెఱయ
( దేవదత్తమునిచ్చి,) దేవదేవుండు
దేవేంద్రునిట్లనుఁ దేటనవ్వమర :
“వాసవ, ఖాండవవనమున నేను
మోసపోయితినని మొగిఁగుందవలదు;
ఆరీతి ననలున కఱుగమిచేయు
కారణంబున కిట్లుకమరె నవ్వనము.
ఈఖాండవమువోయిననేమి! నీకు
నాకీశ, యున్నది నందనవనము.
తొల్లిటికంటెను దోరంపుతోట
యెల్లవృక్షంబుల నెల్లపూఁబొదల
మొల్లమై ఫలముల నుల్లసిల్లుచును
ఫుల్లలతాజా(లపుం)జితభ్రమర
కోకిల శుకపిక కూజిత యుక్తి
నేకాలమునుగల్గి యింపొందుఁగాత."