పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/539

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; అష్టమాశ్వాసము

473


'ఖాండవమనుతోఁటఁ గాల్పుము ; నీకు
నుండు నిక్కువమందు నొనరెడుమందు;
అదియు నింద్రునితోఁట.' యని బ్రహ్మ చెప్పఁ,
గదలి యేఁబోయి యాఖాండవవనము
కాలుపఁ, గోపించి కావలివారు
వేలసంఖ్యలు నన్ను వెడల నేయుటయుఁ,
గ్రమ్మఱ నా హేమగర్భునిఁగదిసి
యిమ్ముల నాచందమెఱిఁగింప నతఁడు :
"తత్తరింపకు; తోఁట తవిలి నీకొనగ
వత్తురు విజయుండు వాసుదేవుండు;
అప్పుడు నీకోర్కి యగుఁగాక; నేడు
చప్పుడుగాకుండఁ జను." మన్న, నేను
నుండితి నొదిగి ; నేఁడొగి మిమ్ముఁగంటి;
నిండు ఖాండవభిక్ష యిదినాకురక్ష ."
అని బార్ధుఁడిట్లను : "నట్లైన మాకు
ననిమిష పతితోడ నాజి గాఁగలదు;
తగినయమ్ములు విల్లుఁ దగినరథ్యములు
దగిన తీరును లేవు తలపోయమాకు;
శౌరికిఁ దగినయస్త్రము లేదు మొదల ;
నేరీతి ! " యనుటయు, నింతలో నగ్ని
వరుణ దేవుని నాత్మవగచి రప్పించి,
వరుణునియింటఁ బూర్వమునఁ జంద్రుండు
దిక్కులుసాధించి ధృతి దాఁచినట్టి
యక్కజంబైన విల్లా గాండివంబు,
సమరభయంకరాక్షయ తూణబాణ
యమలంబు, గంధర్వహయములరథము
నరునకుఁ దగనిమ్ము; నాఁటిచక్రమును
నురుగదయును శౌరికొసగుము పొసఁగ.