పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/534

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

468

ద్విపద భారతము


పొదఁడు యాదవులార! పొలఁతియుఁ దానుఁ
గదలి యాతఁడు దవ్వుగాఁబోక యుండ."
అని విజృంభించిన, హరి రాముఁజూచి
వినయసంభ్రమములు వెలయ నిట్లనియె:
విను రామ, నిలునిలు వేగిరపడకు;
మెనయ నాతఁడు దవ్వుకేఁగు నింతకును;
యతిమాత్రుఁడన నేల! యఁత డర్జునుండు;
మతి నేఁడెఱింగితి మగటిమి చూచి,
హితమతి నేనుండ నిట్లేఁగెఁగాక
యతివకై పురమెల్ల, నాహుతిగొనఁడె!
ఎప్పుడే నొకనికి నీవలెఁ గన్య;
నప్పాండవుఁడు పెండ్లియై పోవనిమ్ము.
అగణితగాంధర్వమను వివాహంబు
తగుచోటఁ గలిగించె దైవంబుసతికి.
గొనకొన మేనత్తకొడుకు చూచినను;
ఘనత నాతనిసొమ్ము గైకొనె నతఁడు.
వలవదు నీ కేటివలవనిఱంతు!
కలహింప శక్యమే కౌంతేయు మొదల"
అనిన, రాముఁడు వింజిమాఁకిడినట్లు
దనుజమర్దనుమాట దాటంగనోడె.

అర్జునుఁడు సుభద్రతో నింద్రప్రస్థము సేరుట


అంతనక్కడఁ బార్థుఁడటపోయిపోయి
కాంతి నింద్రప్రస్థకటకంబుచేరి,
తనయూళ్లవారలెంతయుఁ దన్నుగూడి
చనుదేర, మిక్కిలిసంభ్రమంబునను
ఇంతిసుభద్రతో నిట్లను : "నీవు
వింతగాఁ బాంచాలి వెస మున్నుగదిసి