పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/517

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; అష్టమాశ్వాసము

451


కమ్మనియప్పాలఁ నలవంటకముల
రమణ మహోపహారమ్ము సేయించి,
కవ్వడి యటఁబోయి కాంచీపురమున
నవ్విష్ణు సేవించి, యభవుమహేశు
నేకామ్రనాథు గౌరీశుఁ కామాక్షిఁ
గైకొని మదిఁబూని కదలియాక్షణమ
యరుణాచలమునకు నర్థితోఁబోయి,
యరుణేశుఁ బూజించి, యభ్రసరసికిని
జని శివగంగలో స్నానంబు చేసి,
పెనుగొన్న వేడ్కతో భక్తవత్సలుని
నాచిదంబరనాథు నర్చించి ప్రీతి,
వేచని కమలాలయేశు విశ్వేశు (?)
భావించి సేవించి ప్రార్థించి కదలి,
సేవితనిర్వాణు శ్రీపతిబాణు
జంబునాథుని పాదజలజముల్ గొలిచి,
యంబుజలోచనుండంతఁ గావేరి
దక్షిణగంగగదాయని యందు
దక్షిణమూర్తుల దానంబుచేసి,
సేతురామేశ్వరు శివుఁగానఁ బోయి
బ్రాఁతి నచ్చటఁ దులాభారంబు తూఁగి,
యంతలో వ్రతముసమాప్తిఁ బొందుటయు
నెంతయు యమసూతికెఱుఁగంగఁ బుచ్చి,
యతఁడంతఁ జిత్రవాహనుఁడనుశబర
పతియూర ధీరుఁడై పైత్రోవ నడవ,
నతనిని జెంచు తానతివైభవమున
హితమతిఁ గొంపోయి యింటఁబూజించి,
యతనికి మదిలోనియాసక్తిఁదెలిపి
యతివఁ జిత్రాంగదయసుపుత్రిఁజూపి :